MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • ఎయిరిండియా ప్రమాదంనుండి బయటపడ్డ ఒకేఒక్కడు.. విశ్వాస్ కుమార్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

ఎయిరిండియా ప్రమాదంనుండి బయటపడ్డ ఒకేఒక్కడు.. విశ్వాస్ కుమార్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

Ahmedabad Air India Plane Crash : అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం నుండి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ ఎలా ఉన్నాడు? అతడి ఆరోగ్య, మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

3 Min read
Arun Kumar P
Published : Nov 03 2025, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడు విశ్వాస కుమార్ ప్రస్తుత పరిస్థితేంటి?
Image Credit : X/Kisna179

అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుడు విశ్వాస కుమార్ ప్రస్తుత పరిస్థితేంటి?

Air India plane crash : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం... కేవలం భారత్‌నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఘటన. ఈ భయానక ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 241 మంది చనిపోయారు. మరోవైపు మెడికల్ కాలేజీ హాస్టల్‌ భవనంపై ఈ విమానం కూలడంతో అమాయక విద్యార్థులు కూడా బలయ్యారు. ఇలా ఈ ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది. 

అయితే ఈ ఘోర విమాన ప్రమాదం నుండి బతికి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ తన సోదరుడితో కలిసి ఈ విమానంలో ప్రయాణించాడు. మిగతా ప్రయాణికులతో పాటే  అతడి సోదరుడు ప్రమాదంలో చనిపోగా విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికాడు. ఇంతటి ఘోర ప్రమాదంనుండి ప్రాణాలతో బైటపడ్డ విశ్వాస్ కుమార్‌ను లక్కీ మ్యాన్‌గా భావించారు.. కానీ ప్రస్తుతం ఇతడి పరిస్థితి దయనీయంగా మారినట్లు తెలుస్తోంది.

25
విశ్వాస్ కుమార్ కు ఏమైంది?
Image Credit : Asianet News

విశ్వాస్ కుమార్ కు ఏమైంది?

ఈ ఏడాది జూన్ 12న గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.. విమానంలో ఇంధనం నిండుగా ఉండటంతో ఇది కూలినచోట భారీ మంటలు చెలరేగి దగ్గర్లోని భవనాలు కూడా కాలిబూడిదయ్యాయి. ఇంతటి ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రతి ఒక్కరు మరణించారు... కానీ ఆశ్చర్యకరంగా ఒక్క విశ్వాస్ కుమార్ మాత్రం బతికి బయటపడ్డాడు.

ఈ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు విశ్వాస్. కానీ ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా మెంటల్ కండీషన్ దెబ్బతిందని... అతడు ఇంకా భయంభయంగానే ఉంటున్నాడని తెలుస్తోంది. ఈ ఘటనలో తోటి ప్రయాణికులు మరీముఖ్యంగా అప్పటివరకు తన పక్కనే ఉన్న సోదరుడు మరణించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోతున్నాడట. ఇలా తనకు అండగా నిలిచిన సోదరుడి మరణం, మరోవైపు ఈ భయానక దుర్ఘటన విశ్వాస్ కుమార్‌ను మానసికంగా, శారీరకంగా కుంగదీసింది.

Related Articles

Related image1
Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్.. టైమ్‌లైన్ ఫోటోలు ఇవే
Related image2
Air India Plane Crash : 38 సెకన్లలోనే అంతా జరిగిపోయింది.. మినిట్ టు మినిట్ డిటెయిల్స్
35
భార్య, కొడుకుతో మాటల్లేవు, ఒంటరివాడైన విశ్వాస్
Image Credit : X

భార్య, కొడుకుతో మాటల్లేవు, ఒంటరివాడైన విశ్వాస్

విశ్వాస్ కుమార్ మళ్ళీ మామూలు మనిషి కావాలని అనుకుంటున్నాడు... కానీ అది సాధ్యం కావడం లేదు. ఆ ప్రమాద ఘటన అతడు అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. ఈ ప్రమాద నుండి బయటపడి బతికి ఉన్నానని కూడా అతడు నమ్మలేకపోతున్నాడట. సోదరుడిని కోల్పోయిన బాధతో విశ్వాస్ కుమార్ కుంగిపోతున్నాడు... ఇంట్లో ఉన్నా గదిలోకి వెళ్లి ఒంటరిగా ఉంటున్నాడట. భార్య, కొడుకుతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు... ఒంటరితనంలోనే జీవితం గడుపుతున్నాడు. తాను అంతా కోల్పోయినట్లు అనిపిస్తోందని తాజాగా విశ్వాస్ కుమార్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు

 ప్రమాదం నుంచి కలిగిన షాక్ నుంచి విశ్వాస్ కుమార్ ఇంకా బయటపడలేదని అతడి తాజా ఇంటర్వ్యూను బట్టి అర్థమవుతోంది. కళ్ళముందే సోదరుడు చనిపోవడంతో అతడి మానసికంగా దెబ్బతిన్నాడు. శరీరానికి అయిన గాయాలు మానిపోయాయి... కానీ మనసుకు అయిన గాయం ఇంకా మానలేదు. తన పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు అనిపిస్తోందని విశ్వాస్ కుమార్ ఇంటర్వ్యూలో చెప్పారు.

45
తల్లి బాధ చూడలేకపోతున్నా.. విశ్వాస్ ఆవేదన
Image Credit : X/Kisna179

తల్లి బాధ చూడలేకపోతున్నా.. విశ్వాస్ ఆవేదన

''సోదరుడు అజయ్ మా అందరికీ బలం. అజయ్ మరణం నాకు మాత్రమే కాదు, మా కుటుంబంలో అందరికీ షాక్ ఇచ్చింది. మా అమ్మ ప్రతిరోజూ గుమ్మం దగ్గర కూర్చుని సోదరుడి కోసం ఎదురుచూస్తారు… ఎవరితోనూ మాట్లాడటం లేదు. నాకు కూడా ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ఇల్లు నిశ్శబ్దంగా మారింది. నేను మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాను'' అని విశ్వాస్ కుమార్ చెప్పారు.

55
విశ్వాస్ కుమార్ కు ఆర్థిక సమస్యలు
Image Credit : ANI

విశ్వాస్ కుమార్ కు ఆర్థిక సమస్యలు

''విమాన ప్రమాదం తర్వాత చాలాకాలం చికిత్స తీసుకున్నాను... కానీ ఇప్పటికీ నొప్పి తగ్గలేదు. పని చేయలేకపోతున్నాను... కనీసం సొంతంగా డ్రైవ్ చేయలేకపోతున్నాను. కుటుంబ పోషణ కష్టమవుతోంది. ప్రమాదంనుండి బయటపడిన తనకు పరిహారంగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ అది ఇక్కడి పరిస్థితులకు సరిపోవడం లేదు. అందమైన జీవితం దుర్భరంగా మారింది. ఆర్థిక వనరులు ఆగిపోయాయి. మానసిక సమస్యలు వేధిస్తున్నాయి'' అని విశ్వాస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

''సమస్యల గురించి చెప్పి పరిష్కార మార్గం సూచించమని ఎయిర్ ఇండియా వాళ్లతో మాట్లాడాను... కానీ నా అభ్యర్థనను తిరస్కరించారు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాను. ముందు ఏం చేయాలో తోచడం లేదు'' అని ఎయిర్ ఇండియా ప్రమాదంనుండి బయటపడ్డ విశ్వాస్ కుమార్ చెప్పారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved