- Home
- Districts News
- Hyderabad
- Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. వేలాది మందికి కొత్త ఉద్యోగాలు
Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. వేలాది మందికి కొత్త ఉద్యోగాలు
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనిరవార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐకి అడ్డాగా మారుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Goolge Microsoft
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఏఐ శ్రీకారం చుట్టనుందని ఇప్పటికే టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని అంటున్నా, దీంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని మరికొందరు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా టెక్ దిగ్గజాలు ఇప్పటికే ఏఐని విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్తో పాటు, గూగుల్ హైదరాబాద్ కేంద్రంగా ఏఐని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపింది.
Google AI
గూగుల్ ప్రతినిధులతో సమావేశం..
హైదరాబాద్లో తన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ప్రభుత్వంతో కలిసి కృత్రిమే మేధ ఆధారిత సేవలు అందించేందుకు గూగుల్ గురువారం ఒప్పందం కుదురుచ్చుకుంది. ఇందులో భాగంగానే గచ్చిబౌలిలోని టీ హబ్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుల సమక్షంలో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానాతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు ఎంవోయూపై సంతకాలు చేశారు. వ్యవసాయం, పరిపాలన, రవాణా విద్యా వంటి కీలక రంగాల్లో ఏఐ సేవలను అమలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ పేరుతో ఏఐ నైపుణ్యాలు పెంచే దిశగా గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్ధతులను ప్రారంభిస్తుంది.
ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత తెలంగాణ దార్శనికతకు గూగుల్ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ లక్ష్య సాధనలో గూగుల్తో ఒప్పందం కీలకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
microsoft
మైక్రోసాఫ్ట్ విస్తరణ..
ఇదిలా ఉంటే మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కొత్త బిల్డింగ్ను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ విస్తరణతో వేలాది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది.
అదే విధంగా మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యంత్రి తెలిపారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకోనున్నట్టు చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ కొత్త కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.