తులసీ కషాయం.. ఆ వ్యాధులన్నింటికీ చెక్..!
ఈ జలుబు, దగ్గులను కూడా తులసి కషాయంతో పూర్తిగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి కూడా బాగా పెరుగుతుందట.
వాతావరణం కాస్త మారితే చాలు.. ఎవరైనా సరే జలుబు, దగ్గు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా.. పెద్దగా రిలీఫ్ లభించదు. కానీ.. వీటి నుంచి బయటపడాలంటే... కేవలం హోమ్ రెమడీతోనే పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తులసీ కషాయం.. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి వాటి నుంచి బయటపడవచ్చట. తులసి మన అందరికీ తెలిసిన ఆకు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం.. చర్మ సౌందర్యం కోసం తులసి ఆకులను మనం ఉపయోగిస్తున్నాం.
అయితే... ఈ జలుబు, దగ్గులను కూడా తులసి కషాయంతో పూర్తిగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి కూడా బాగా పెరుగుతుందట.
తులసి లో అనేక వైద్య లక్షణాలు ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పైరెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు తగ్గించడానికి సహాయం చేస్తాయి.
అంతేకాకుండా.. విటమిన్ ఎ, డి, ఐరన్ , ఫైబర్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు అద్భుతాలు చేస్తుంది. హానికరమైన వ్యాధికారక కణాల నుండి బయటపడటానికి మన శరీరానికి సహాయపడుతుంది. తులసి కషాయమ్ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మరింత ఎక్కువగా పనిచేస్తుంది. జలుబు , దగ్గును చాలా వేగంగా తొలగిస్తుంది.
తులసి కషాయం ఎలా తయారు చేయాలి..?
ఆకుపచ్చ తులసి ఆకులు
- ఒక కప్పు ఉడికించిన కంది పప్పు నీరు
- 1 స్పూన్ నెయ్యి
-స్పూన్ మిరియాలు
- జీలకర్ర ½ స్పూన్
- 1 స్పూన్ తేనె
తయారీ విధానం..
జీలకర్ర, మిరియాలు రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత వీటిని ఓ ప్యాన్ లో వేసి వేడి చేయాలి. తర్వాత అందులో.. ఉడికించిన పప్పు ఉడికించిన నీరు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో తులసి ఆకులు వేసి మరగనివ్వాలి. తర్వాత.. వాటిని మరగించి.. చల్లారనిచ్చి ఆ నీటిని తాగాలి. చిన్న పిల్లలకు సైతం ఈ నీటిని తాగించవచ్చట. అయితే.. చల్లారనిచ్చి తాగించాలి.
ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. ఈ కషాయానికి వాడిన అన్నింటిలోనూ ఎన్నో విటమిన్లు ఉండటం గమనార్హం. కాబట్టి.. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది.