కరోనా తొలి డేస్ వేయించుకున్నారా..? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
చాలా మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నాం కదా.. ఇంక రెండో దానితో పనేముందిలే అని అనుకుంటున్నారు. కొందరేమో.. ఫస్ట్ డోస్ వేయించుకున్నా కూడా తమకు కరోనా సోకిందని... ఈ వ్యాక్సిన్ సరిగా పనిచేయడం లేదంటూ తీర్పులు ఇచ్చేస్తున్నారు.
కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో మనకు తెలిసిన విషయమే. ప్రతిరోజూ లక్షల మంది దీని బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడం మాత్రమే పరిష్కారం. అందుకే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది ఫస్ట్ డోస్ వేయించుకోగా... సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కొందరు రెండు డోస్ లుు వేయించుకున్నారు.అయితే.. చాలా మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నాం కదా.. ఇంక రెండో దానితో పనేముందిలే అని అనుకుంటున్నారు. కొందరేమో.. ఫస్ట్ డోస్ వేయించుకున్నా కూడా తమకు కరోనా సోకిందని... ఈ వ్యాక్సిన్ సరిగా పనిచేయడం లేదంటూ తీర్పులు ఇచ్చేస్తున్నారు.
అయితే.. ఈ విషయంపై తాజాగా యూకేకి చెందిన ఓ పరిశోధన సంస్థ ఇలా జరగడానికి గల కారణాలను తెలియజేసింది. గతేడాది కూడా కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం చేసింది.
కానీ.. అప్పుడు ఉన్న రికవరీ రేటు ఈ ఏడాది కనిపించడం లేదు.. ఎదుకంటే.. అప్పటి వైరస్ కీ.. ఇప్పుడున్న వైరస్ కీ తేడా ఉంది. గతంలో ఉన్న వైరస్ ఇప్పుడు జన్యుపరంగా మార్పు చెందింది. అందుకే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కరోనా తొలి డోస్ తీసుకున్నవారు.. గతంలో ఉన్న కరోనా వైరస్ ని అయితే తట్టుకోగలుగుతున్నారు. కానీ.. జన్యుపరమైన మార్పులు చేసిన వైరస్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా అందరూ రెండు వ్యాక్సిన్ డోస్ లు తీసుకోవాలని వారు చెబుతున్నారు.
రెండు వ్యాక్సిన్ డోస్ లు తీసుకున్న వారు మాత్రమే.. ఈ కొత్త రకం జన్యుమార్పిడి చేసుకున్న వైరస్ ని తట్టుకోగలుగుతున్నారట. అందుకే.. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వైరస్ ఎటాక్ చేస్తోందని పరిశోధనలో తేలింది.
ప్రస్తుతం భారత్ లో కోవిషీల్డ్, కో వ్యాగ్జిన్ అనే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవ్యాగ్జిన్ తక్కువగా ఉండటంతో.. ఎక్కువ మంది కోవీషీల్డ్ వేయించుకుంటున్నారు.