MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మహిళలు 30 వయసు దాటిందంటే ఈ డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే?

మహిళలు 30 వయసు దాటిందంటే ఈ డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే?

30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క మహిళలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే మహిళల ఆరోగ్యం కొరకు తప్పనిసరిగా కొన్ని పానీయాలు సేవించడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. మరి ఆ పానీయాలు ఏంటంటే.. 

2 Min read
Author : Navya G
Published : Nov 15 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా తనలో ఉన్నటువంటి శక్తిని కోల్పోవడమే కాకుండా ఎముకలు కండరాలు బలహీనంగా తయారవుతూ ఉంటాయి తద్వారా మహిళలు దృఢంగా ఉండడం కోసం కొన్ని రకాల పానీయాలను సేవించడం ఎంతో మంచిది.మహిళలు ఇంటి బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు పిల్లల బాధ్యతలు అంటూ పనులలో పడి ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ విధంగా పనులలో నిమగ్నమై సరైన సమయానికి తినక పోవడం వల్ల వారిలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదే విధంగా 30 సంవత్సరాలు వయసు దాటిన మహిళలలో వారి ఎముకలు దృఢత్వం కోల్పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎముకలు కండరాల దృఢత్వం కోసం ఈ పానీయాలు స్మూతీలు తప్పనిసరిగా తీసుకోవాలి.

35

మనం తయారు చేసుకొనే స్మూతీలు, జ్యూసులు లస్సీలు వంటి వాటిలో చియా సీడ్స్ కలుపుకొని పోషక విలువలను పెంపొందించుకోవచ్చు అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలో వేడిని తగ్గించడానికి అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో దోహదపడతాయి. అదేవిధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తాయి.
 

45

30 సంవత్సరాలు వయసు దాటిన మహిళలలో ఎముకల సాంద్రత,వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించడం ఎంతో అవసరం అందుకే పాల కన్నా ఎక్కువగా పెరుగుతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం మంచిది. పెరుగులో ఉన్నటువంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా శరీరానికి ఎంతో ప్రయోజనకరం. అందుకే పెరుగుతో పాటు పలు రకాల బెర్రీలను కూడా తీసుకోవడం మంచిది.
 

55

మార్కెట్లో లభించే బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ, రాస్ బెర్రీ లను స్మూతీస్ లేదా షేక్స్ రూపంలో చేసుకుని తాగితే మంచిది. ఇందులో ఉన్నటువంటి ఖనిజలవనాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మన శరీరానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మన శరీరంలో జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించడానికి దోహదపడుతుంది. ఇక చేమంతి పూలతో టీ తయారు చేసుకునే తాగటం వల్ల మన శరీరంలో ఎముకలు దృఢంగా మారడమే కాకుండా బోలుఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది అలాగే మహిళలలో వచ్చే రుతుక్రమ నొప్పిని కూడా నివారించడానికి దోహదపడుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved