MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తే.. ఇంత ప్రమాదమా..?

ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తే.. ఇంత ప్రమాదమా..?

మనం నిద్ర లేచిన రెండు గంటలలో పు అల్పాహారం పొట్టలో పడిపోవాలట. అలా కాకుండా ఆలస్యం చేస్తూపోతే.. ఏకంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

2 Min read
ramya Sridhar
Published : May 30 2024, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనం రోజు తీసుకునే ఆహారంలో అల్పాహారం చాలా  కీలకం. కానీ చాలా మంది రాత్రి భోజనం చాలా ఎక్కువ గా తినేసి.. ఆకలిగా వేయడం లేదని అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు. కొందరేమో ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తాం.. లంచ్ కాస్త తొందరగా చేస్తే సరిపోతుందిలే అనుకుంటారు.   కానీ...  బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

26

ఇక కొందరు.. అల్పా హారం అని చెప్పి.. పదికో , పదకొండుకో తింటారు. కానీ.. అల్పాహారం తినడం ఎంత ముఖ్యమో.. దానిని ఏ టైమ్ కి తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనం నిద్ర లేచిన రెండు గంటలలో పు అల్పాహారం పొట్టలో పడిపోవాలట. అలా కాకుండా ఆలస్యం చేస్తూపోతే.. ఏకంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

36

ఉదయాన్నే ఆలస్యంగా అల్పాహారం తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది.

46


ఉదయం 9 గంటల తర్వాత మొదటి భోజనం చేసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆలస్యమైన ప్రతి గంటకూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6 శాతం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

56
cancer

cancer


రాత్రిపూట ఆలస్యంగా తినడం లేదా ఉదయం లేట్‌గా అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయినప్పటికీ, రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

66


రాత్రి 8 గంటలకు ముందు తిన్న వారి కంటే రాత్రి 9 గంటల తర్వాత తిన్న స్త్రీలకు స్ట్రోక్ , సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులను తగ్గించడంలో భోజన సమయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల రాత్రిపూట పొద్దున్నే తిని, ఉదయం 8 గంటలలోపు టిబన్ తినేవారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు సూచిస్తున్నారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved