ఎండాకాలంలో ఈ మసాలా దినుసులను తింటే..!
ఎండాకాలంలో పండ్లను ఎక్కువగా తింటారు. మసాలా దినుసులను చాలా వరకు తగ్గిస్తారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్ లో కూడా కొన్ని మసాలా దినుసులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?
వాతావరణాన్ని బట్టి మన ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి. ఎండాకాలంలో పండ్లను, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను ఎక్కువగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి శరీర వేడిని తగ్గిస్తాయి. అయితే ఎండాకాలంలో చాలా మంది మసాలా దినుసులకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయని. వేసవిలో మసాలా దినుసులను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. అవేంటంటే..
![article_image2](https://static-ai.asianetnews.com/images/01g0h76g6r3mrj4ghts477xj7d/download--1--jpg_300x184xt.jpg)
జీలకర్ర
జీలకర్ర గింజల్లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. కాచి చల్లార్చిన జీలకర్ర నీటిని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దాహం తీర్చడానికి ఈ జీరా వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. జీలకర్ర వాటర్ డీహైడ్రేషన్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనిని జీలకర్ర నీటితో తగ్గించుకోవచ్చు. అందుకే ఎండాకాలంలో ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారికి జీలకర్ర కూడా సహాయపడుతుంది. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
coriander
కొత్తిమీర
కొత్తిమీరను ఎక్కువగా గార్నిషీ కోసం ఉపయోగిస్తారు. కొత్తిమీర రుచికే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కూడా ఉంటాయి. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. కొత్తిమీరలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్స్, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
mint leaves
పుదీనా ఆకులు
పుదీనా ఆకుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఎండాకాలంలో పుదీనా వాటర్ ను తాగితే శరీరం చల్లగా ఉంటుంది. ఈ ఆకులు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
Image: Getty Images
యాలకులు
యాలకులు సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందాయి. యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మీ జీవక్రియను పెంచుతాయి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. యాలకుల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ బి 6, విటమిన్ బి 3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
ఎండాకాలంలో ఈ మసాలా దినుసులను తినకండి
ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలను ఎండాకాలంలో అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు తగ్గించాలి.