కరోనాపై పోరాటం.. రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకుందామా..!
రోగనిరోధక శక్తిని మనం ఒక్క రోజులో సాధించలేం. బిల్డింగ్ పైకి వెళ్లడానికి మెట్లు ఎక్కాల్సి వస్తే.. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఎలా వెళతామో.. అదే విధంగా మనం తీసుకునే జాగ్రత్తలతో.. ప్రతిరోజూ కొద్దికొద్దిగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎంత ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తున్నా.. మన వంతు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన సమయం ఇది. లాక్ డౌన్ విధించారు కాబట్టి.. ఇంటి పట్టునే ఉండటం శ్రేయస్కరం. అంతేకాదు.. బయటకు వెళ్లినా.. మాస్క్ ధరించడం తప్పదు.
అంతేకాదు.. ఇతరులకు దూరంగా ఉంటూ సామాజిక దూరం పాటించడం కూడా తప్పనిసరి. ఇదొక్కటే సరిపోదు.. కరోనా సోకినా.. దాని నుంచి ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే అవసరం. మనమందరం ఎవరికి వారమే.. కరోనాతో పోరాడాల్సిన సమయం ఇది. దానికోసం ఏం చేయాలో... నిపుణులు ఏం చెబుతున్నారో.. ఇప్పుడు చూద్దాం...
రోగనిరోధక శక్తిని మనం ఒక్క రోజులో సాధించలేం. బిల్డింగ్ పైకి వెళ్లడానికి మెట్లు ఎక్కాల్సి వస్తే.. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఎలా వెళతామో.. అదే విధంగా మనం తీసుకునే జాగ్రత్తలతో.. ప్రతిరోజూ కొద్దికొద్దిగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
1. రోగనిరోధక శక్తిపెంచుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. 70శాతం రోగనిరోధక శక్తి బ్యాలెన్స్ డ్ డైట్ వల్లే లభిస్తుంది. అయితే.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల అది సాధ్యమో కూడా నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ, సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్, దహీ, వెల్లుల్లి.. ఈ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైరస్ తో పోరాడటానికి సహాయం చేస్తాయి. తులసి టీ తీసుకోవడం కూడా చాలా మంచిది.
సిట్రస్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లపై పోరడటానికి సహాయం చేస్తాయి.
బాదం లాంటివాటిల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇక వెల్లుల్లి కూడా రోగనిరోదక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది.
2.సరైన సప్లిమెంట్స్..
ప్రతిరోజూ ఆరోగ్యానికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. అవి కూడా హెర్బల్ సప్లిమెంట్స్.. అధికారికంగా సర్టిఫైడ్ చేసిన వాటిని తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యమైన ఆహారంతోపాటు.. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మరింత రోగనిరోదక శక్తిని పెంపొందించుకోగలుగుతాము.
3.బాడీ హైడ్రేట్ గా ఉంచుకోడం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరంలో 60శాతం నీరు ఉండేలా చూసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. లేదా వాటర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.
4.వ్యాయామం.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లలేం. జిమ్ లకు వెళ్లి వ్యాయామాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి... ఇంట్లోనే సింపుల్ వర్కౌట్స్ చేసుకోవడం ఉత్తమం.
5. మద్యం, పొగ తాగడం..
ఈ రెండింటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. కచ్చితంగా ఈ రెండింటికి దూరంగా ఉండటం చాలా అవసరం.
6. నిద్ర.. మనిషికి నిద్ర కూడా చాలా అవసరం. నిద్రలేమితో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి.. సరిపోను నిద్ర కూడా చాలా అవసరం.