ఎంత తిన్నా బక్కగానే ఉన్నారా... పెరుగుతో ఇలా తింటే వెంటనే బరువు పెరగడం ఖాయం!
చాలామంది వారు తీసుకునే ఆహారం కారణంగా అధిక శరీర బరువు పెరగడమే కాకుండా అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు అయితే మరి కొందరు బొక్క పలుచగా ఉంటారు .ఇలా బక్క పలుచగా ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరి శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది అధిక శరీర బరువుతో బాధపడుతూ శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో కఠిన వ్యాయామాలు చేస్తూ సరైన ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు.అదేవిధంగా మరికొందరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీర బరువు చాలా తక్కువగా ఉంటారు. ఈ విధంగా చాలా బక్క పలుచగా ఉండేవాళ్లు ఈ ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే శరీర బరువు తప్పనిసరిగా పెరుగుతారు.
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటే శరీరం బరువు పెరుగుతారనే విషయం మనకు తెలిసిందే. అయితే కార్బోహైడ్రేట్లతో పాటు పిండి పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే అధిక మొత్తంలో పిండి పదార్థాలు కలిగినటువంటి బంగాళాదుంపలలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.
ఈ విధంగా ప్రతిరోజు ఒక మీడియం సైజు బంగాళదుంపను మన ఆహార పదార్థాలలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి క్యాలరీలతోపాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. బంగాళదుంపలతో పాటు పెరుగు కూడా తీసుకోవడం వల్ల శరీర బరువు పెంచుకోవచ్చు. ఫుల్ క్రీం పాలతో తయారు చేసినటువంటి పెరుగును తినడం వల్ల శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది.100 గ్రాముల ఫుల్ క్రీమ్ పాలు పెరుగులో 20 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6 గ్రాముల చక్కెర ఉంటుంది.
ఈ క్రమంలోనే శరీర బరువు పెరగాలనుకునేవారు ఉడికించిన బంగాళదుంపను కొద్దిగా పెరుగు పంచదారలో కలిపి తరచూ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగాలనుకున్నవారు చాలా తొందరగా శరీర బరువు పెరుగుతారని, వీటిలో మన శరీరానికి అధికంగా క్యాలరీలు లభించడం వల్ల తొందరగా శరీర బరువు పెరగడానికి కారణమవుతుంది.