పాలు తాగితే అసిడిటీ యా? ఈ వంటింటి చిట్కాలు ట్రై చేయండి..
పిల్లలు కానీ, పెద్దలు కానీ పాలు మంచి పౌష్టికాహారం అనే విషయాన్ని చిన్నప్పటినుండి వింటుంటాం. పాలు తాగడం వల్ల బలంగా, పుష్టిగా తయారవుతారు. ఆరోగ్యానికీ ఎంతో మంచివైన పాలు తాగడం వల్ల కొంతమందిలో అసిడిటీ సమస్యలు వస్తాయి. కడుపులో ఉబ్బరం, ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బందులతో బాధపడతారు.
పిల్లలు కానీ, పెద్దలు కానీ పాలు మంచి పౌష్టికాహారం అనే విషయాన్ని చిన్నప్పటినుండి వింటుంటాం. పాలు తాగడం వల్ల బలంగా, పుష్టిగా తయారవుతారు. ఆరోగ్యానికీ ఎంతో మంచివైన పాలు తాగడం వల్ల కొంతమందిలో అసిడిటీ సమస్యలు వస్తాయి. కడుపులో ఉబ్బరం, ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బందులతో బాధపడతారు.
ఇలాంటి సమస్యలు రాగానే పాలు తాగడం మానేస్తుంటారు. అయితే దీనికి పరిష్కారం లేదా? అసిడోసిస్ ను ఎలా ఎదుర్కోవాలి. పాలు తాగినా ప్రాబ్లంస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా వంటింటి చిట్కాలున్నాయా?
పాలల్లో ఎక్కువ మోతాదులో ఉండే లాక్టోజ్ జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీనివల్లే చాలాసార్లు కడుపునొప్పి, అసిడిటీ, జీర్ణంకాకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
కొన్ని రకాల ఆహారపదార్థాలు, పానీయాలు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి వల్ల శరీరంలో ఆసిడ్ స్థాయిలు పెరుగుతాయి. పాలు కూడా వీటిల్లో ఒకటే.
పాలలో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వు, ప్రొటీన్లు కడుపు కండరాలను బలహీన పరుస్తాయి. అందుకే కాళీ కడుపుతో పాలను తాగకూడదు.
కొంతమంది పాల ప్యాకెట్ కట్ చేసి అలాగే తాగేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. అలా పచ్చిపాలు తాగడం వల్ల కడుపు చెడిపోయే ప్రమాదం ఉంది. కాగబెట్టినప్పుడు పాలల్లోని హానికారక బ్యాక్టీరియా చచ్చిపోతుంది.
పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. పెద్దలు కూడా చాలాసార్లు ఇది చెబుతుంటారు. ఇది పూర్వకాలం నుండి వాడుకలో ఉన్న పద్ధతి.
అల్లం తురిమి పాలల్లో వేసుకుని తాగడం వల్ల కఫం రాకుండా ఉంటుంది. దీంతోపాటు తురిమిన అల్లం, లవంగాలు, ఇలాచీ, కుంకుమపువ్వు లాంటివి అపానవాయువు నుండి ఉపశమనం లభిస్తుంది.
రాత్రిపూట పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిదని చెబుతారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు చల్లటి పాలు మాత్రమే తాగాలి. చల్లటి పాలు ఈజీగా జీర్ణం అవుతాయి. దీనివల్ల కడుపుతో వికారం తగ్గిస్తుంది.
కడుపులోని అసిడిటీ తగ్గాలంటే చల్లటి పాలలో ఒక స్పూన్ ఇసాబ్గోల్ కలుపుకుని అన్నం తిన్న తరువాత తాగితే అసిడిటీ ఉండదు.
ఈ సమస్య ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు వేడిపాలు కాకుండా చల్లటి పాలు తాగాలి. తాగిన వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం వల్ల ఈ సమస్యనుండి బైటపడొచ్చు.
పిల్లలు చాలా సార్లు పాలు తాగిన వెంటనే వాంతి చేసుకుంటారు. అలాంటి సమయాల్లో పాలల్లో ఏలకుల పొడి కలిపి ఇస్తే వాంతి చేసుకోరు. అంతేకాదు పిల్లలకు ఒక్కసారే ఎక్కువ పాలు తాగించకుండా కొద్ది కొద్దిగా నాలుగైదుసార్లు పట్టించాలి. దీనివల్ల ఎసిడిటీ రాదు. పిల్లలు పాలు తాగిన వెంటనే వారిని కుదపడం, ఎగిరేయడం లాంటివి చేయకుండా ఉండాలి.