MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పెరుగులో కిస్ మిస్ లను వేసుకుని తింటే ఎంత మంచిదో తెలుసా?

పెరుగులో కిస్ మిస్ లను వేసుకుని తింటే ఎంత మంచిదో తెలుసా?

కిస్ మిస్ లల్లో బోరాన్ ఉంటుంది. ఈ ఖనిజం ఎముకలను, కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఎముకల సమస్యలను తొందరగా నయం  చేయడానికి సహాయపడుతుంది కూడా. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2023, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. ప్రోబయోటిక్ వల్ల మీకు మంచి మొత్తంలో గట్ బ్యాక్టీరియా లభిస్తుంది. మీ జీర్ణక్రియను కూడా అదుపులో ఉంటుంది. అలాగే ఎండుద్రాక్ష, పెరుగు రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలను, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పోషకం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముక సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో కాల్షియం లోపిస్తే మీకు బోలు ఎముకల వ్యాధి వంటి రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే పెరుగు, ఎండుద్రాక్షలను కలిపి తీసుకంటే మీ ఎముకలు బలోపేతం అవుతాయి. పెరుగు, కిస్ మిస్ లను కలిపి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

పెరుగు, ఎండుద్రాక్ష కాల్షియం లోపాన్ని పోగొడుతుంది

పెరుగు, ఎండుద్రాక్ష రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మీ శరీరంలో కాల్షియం మొత్తం పెరుగుతుంది. ఎండుద్రాక్ష, పెరుగులో ఉండే కాల్షియం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను బలోపేతం చేస్తాయి.
 

35

కీళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది

ఎండుద్రాక్షలో బోరాన్ కూడా ఉంటుంది. ఈ ఖనిజం ఎముకలను, కీళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు ఇది ఎముక వైద్యంను మెరుగుపరుస్తుంది. రెండు కీళ్ళ మధ్య కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే పెరుగుతో కిస్ మిస్ లను తింటే కీళ్ల సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

45

ఈ విధంగా పెరుగు, ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి పెరుగును ఫ్రీజ్ చేసేటప్పుడు అందులో ఎండుద్రాక్షలను వేయండి. లేదా ఎండుద్రాక్షతో కలిపిన పెరుగును తినండి. పరిగడుపున లేదా అల్పాహారం సమయంలో ఈ కాంబినేషన్ ను తినడానికి ప్రయత్నించండి.

55

 పెరుగు 'ప్రోబయోటిక్' గా పనిచేస్తుంది. అయితే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఎండుద్రాక్షలు "ప్రీబయోటిక్" గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ కలయిక చెడు బ్యాక్టీరియాను తటస్తం చేస్తుంది. ఆరోగ్యకరమైన గట్, కడుపునకు సహాయపడుతుంది. ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ప్రేగులలో మంటను తగ్గిస్తుంది. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఎముకలు, కీళ్లకు కూడా మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image2
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image3
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved