మధ్యాహ్నం నిద్ర... మంచిదే..!
సుదీర్ఘ ఆయుర్దాయంతో పాటు వచ్చే న్యూరోడిజెనరేటివ్ మార్పులు, డిమెన్షియా (మతిమరుపు) అవకాశాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో 65 ఏండ్ల వయసు పైబడిన 10 మందిలో ఒకరు ఇలా మతిమరుపుతో ఉన్నట్లు గుర్తించారు.
మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేయగానే.. మనకు తెలీకుండానే కళ్లుమూతలు పడతాయి.. ఎక్కడలేని నిద్ర వచ్చి ఆవహించేస్తుంది. అయితే.. నిజానికి ఆ నిద్ర మన ఆరోగ్యానికి మంచిదేనట. ఇటీవల చేసిన ఓ పరిశోధనలో తేలింది.
మధ్యాహ్నం సమయంలో క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల మానసికంగా చురుకుగా మారతామని పరిశోధకులు పేర్కొన్నారు. ఆన్లైన్ జర్నల్ జనరల్ సైకియాట్రీలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మధ్యాహ్నం వేళ నాపింగ్ అనేది మంచి స్థాన అవగాహన, శబ్దాన్ని గుర్తించే పటిమ, పని జ్ఞాపకశక్తితో ముడిపడి ఉంటుంది.
సుదీర్ఘ ఆయుర్దాయంతో పాటు వచ్చే న్యూరోడిజెనరేటివ్ మార్పులు, డిమెన్షియా (మతిమరుపు) అవకాశాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో 65 ఏండ్ల వయసు పైబడిన 10 మందిలో ఒకరు ఇలా మతిమరుపుతో ఉన్నట్లు గుర్తించారు.
వయస్సు పెరిగేకొద్దీ చాలా మందిలో నిద్ర విధానాలు మారుతుంటాయి. వయసు పైబడినవారు సాధారణంగా మధ్యాహ్నం కునుకు తీయాలని చూస్తుంటారు.
అయితే, డిమెన్షియాను నివారించడానికి మధ్యాహ్నం కునుకు సహాయపడుతుందా? లేదా మధ్యాహ్నం కునుకు తీయడం మతిమరుపు లక్షణమా? అనే దానిపై పరిశోధకులు ఏకాభిప్రాయానికి రాలేదు.
చైనాలోని బీజింగ్, షాంఘై, జియాన్ నగరాలతోపాటు అనేక పెద్ద నగరాల్లో నివసిస్తున్న కనీసం 60 సంవత్సరాల వయస్సు గల 2,214 మంది ఆరోగ్యవంతులలో పరిశోధనలు జరిపారు. మొత్తం మీద 1,534 మంది సాధారణంగా మధ్యాహ్నం కునుకు తీయగా.. 680 అలా చేయలేదు.
వీరిలో మతిమరుపును తనిఖీ చేయడానికి మినీ-మెంటల్ స్టేట్ ఎగ్జామ్ (ఎంఎంఎస్ఈ) సహా పలు ఆరోగ్య పరీక్షలు జరిపారు. ఈ రెండు వర్గాల్లో రాత్రిపూట నిద్ర సగటు 6.5 గంటలుగా ఉన్నది.
మధ్యాహ్నం న్యాప్లను భోజనం తర్వాత 5 నిమిషాల నిద్రావస్థ కాలంగా నిర్వచించారు. ఇది 2 గంటలకు మించకుండా చూశారు. పరిశోధనలో పాల్గొన్నవారు వారంలో ఎన్నిరోజులు మధ్యాహ్నం కునుకు తీశారని, అది వారం నుంచి నిత్యంకు దారితీసిందా? అనే దానిపై ప్రశ్నించారు.
చివరగా మధ్యాహ్నం కునుకు 5 నిమిషాల పాటు కొనసాగించిన వారు పనికి సంబంధించిన జ్ఞాపకశక్తిని పెంపొందించుకున్నారని, వీరిలో మానసిక చురుకుదనం కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.