MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • పల్లీలను వీళ్లు మాత్రం తినకూడదు. తింటే సమస్యే

పల్లీలను వీళ్లు మాత్రం తినకూడదు. తింటే సమస్యే

వేరుశెనగలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. దీంట్లో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అయినప్పటికీ.. వేరుశెనగలను కొంతమంది అస్సలు తినకూడదు. 

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 04 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇడ్లీ, దోశ, బోండ, వడ ఇలా ప్రతి టిఫిన్ లోకి పల్లీ చట్నీని చేస్తుంటారు. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ప్రతి టిఫిన్ లోకి పల్లీ చట్నీనే చాలా మంది తినడానికి  ఇష్టపడతారు. ఈ వేరుశెనగల్లో  ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు  పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.

అయితే పల్లీలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. వీటిని కొంతమంది అస్సలు తినకూడదన్న ముచ్చట మీకు తెలుసా? ఒకవేళ తింటే ఆరోగ్య ప్రయోజనాల కంటే హానే ఎక్కువ జరుగుతుంది. 
 

25

పల్లీలను ఎవరు తినకూడదు? 

ఎసిడిటీ

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు మాత్రం పల్లీలను పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీళ్లు పల్లీలు తింటే మలబద్ధకం వచ్చే సమస్య పెరుగుతుంది. అలాగే పల్లీలు గ్యాస్, ఎసిడిటీ,  కడుపునొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి కడుపునకు సంబంధించిన సమస్యలు మరింత పెరిగేలా చేస్తాయి. 

యూరిక్ యాసిడ్ 

పల్లీల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు ఇప్పటికే ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేదా హైపర్యూరిసెమియా సమస్యతో బాధపడుతున్న వారు పల్లీలను ఎక్కువ మొత్తంలో తినకూడదు. ఎందుకంటే పల్లీలు తింటే పరిస్థితి మరింత దిగజారుతుంది. 

హై బీపీ..

అధిక రక్తపోటు తేలిగ్గా తీసుకోవాల్సిన సమస్య కాదు. ఇది ప్రాణాంతక సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వేరుశెనగలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వేరుశెనగలు టేస్టీగా అనిపించడానికి జనాలు సోడియాన్ని ఎక్కువగా కలుపుతున్నారు. ఉప్పుతో వేయించిన పల్లీలను లేదా వేరుశెనగ వెన్న తిన్నా మీ రక్తపోటు మరింత పెరుగుతుంది. ఒకవేళ మీరు వేరుశెనగలను తినాలనుకుంటే ఉప్పు లేకుండా తినకడానికి ప్రయత్నించండి. 

35

శరీరంలో మంట

వేరుశెనగల్లో ఎక్కువ మొత్తంలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కానీ ఒమేగా -3 కాదు. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. అంటే ఈ అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో అసమతుల్యత వల్ల మీ శరీరంలో మంట కలుగుతుంది. 

ఖనిజ శోషణ

పల్లీలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడినా.. ఇది మీ శరీరంలో ఖనిజ శోషణను నిరోధించే అవకాశం ఉంది. వేరుశెనగలో ఉండే కాల్షియం, ఫైటిక్ ఆమ్లం, ఇనుము, జింక్, మెగ్నీషియం శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల ఫైటేట్లు ఖనిజ లోపాలు ఏర్పడతాయి. అలాగే పేగు మార్గంలో  అలెర్జీ, చికాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. 

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారు పల్లీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వేరుశెనగలో కొవ్వులు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీరు బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మాత్రం పల్లీలను తినకండి. 

అలెర్జీ

చాలా మందికి వేరుశెనగల అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు పొరపాటున పల్లీలను తింటే శరీర వాపు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కూడా  వేరుశెనగల అలెర్జీ ఉంటే దీనిని అస్సలు తినకండి. 

45

పల్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె ఆరోగ్యానికి మంచిది: ఏహెచ్ఏ జర్నల్ లో ఒక నివేదిక ప్రకారం.. పల్లీలను లిమిట్ లో తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంతేకాదు ఇది మీ శరీరంలో హైబీపీ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. పల్లీల్లో ఫైబర్ కంటెంట్, మోనోశాచురేటెడ్ కొవ్వు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుది. కాబట్టి ఇది గుండెకు మంచిదని చెప్తారు. 

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:  పల్లీలు డయాబెటీస్ రిస్క్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే చెడు కొవ్వు కూడా ఉండదు. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పల్లీల్లో ఉండే  మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
 

55


ఎన్నో క్యాన్సర్లను నివారిస్తుంది:  పల్లీలను తింటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పల్లీల్లో మంచి మొత్తంలో విటమిన్ ఇ, ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు పల్లీల్లో రెస్వెరాట్రాల్ కూడా మెండుగా ఉంటుంది. ఇది పాలీఫెనోలిక్ యాంటీఆక్సిడెంట్ కాబట్టి ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: పల్లీలు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండై ఫైబర్, ప్రోటీన్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పల్లీలను తింటే మీ ఒంట్లో శక్తి పెరుగుతుంది. అలాగే ఆకలి కూడా అదుపులో ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Recommended image2
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Recommended image3
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved