MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఉడకబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా?

ఉడకబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పల్లీలను కాల్చుకుని తింటుంటారు. కానీ వీటిని ఉడకబెట్టి తింటే బోలెడు లాభాలున్నాయి. ఉడకబెట్టిన పల్లీలను తింటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? 

2 Min read
Shivaleela Rajamoni
Published : Oct 11 2024, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇప్పటికే చలి మొదలైంది. రాను రాను ఇది మరింత ఎక్కవైపోతుంది. అందుకే చలికాలంలో చాలా మంది వేడివేడిగా తింటుంటారు. ఇందుకోసం పల్లీలను కాల్చి  తినడం చాలా మందికి అలవాటు. నిజానికి పల్లీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

అయితే వీటిని నూనెలో వేయించి లేదా, కాల్చి తినడం కంటే ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. అసలు ఉడకబెట్టిన పల్లీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

ఉడికించిన పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

వేరుశెనగలను ఎప్పుడైనా సరే నూనెలో వేయించి అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనివల్ల పల్లీల్లో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. అందుకే పల్లీలను ఉడకబెట్టి తినడమే మంచిది. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉడికించిన వేరుశెనగలను తింటే మీరు బరువు కూడా తగ్గుతారు. పల్లీల్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ తో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వు మెండుగా ఉంటుంది. వీటిని తింటే మీకు కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది. ఫలితంగా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

35
peanut

peanut

ఉడికించిన వేరుశెనగలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. మీకు ఇది వరకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. ఉడకబెట్టిన పల్లీలను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ నూనెలో వేయించిన పల్లీలను మాత్రం తినకండి. 

అలాగే ఉడకబెట్టిన పల్లీలను తింటే మీ కంటి చూపు కూడా మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి ఉడికించిన పల్లీల్లో మన కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ బి 6 లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. 

45

ఉడికించిన వేరుశెనగలు మన గుండెకు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పల్లీలను ఉడికించిన తర్వాత ఈ యాంటీ ఆక్సిడెంట్లు నాలుగు రెట్లు పెరుగుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంటే ఉడికించిన పల్లీలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

55

పల్లీల్లో నియాసిన్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు, ఆరోగ్యకరమైన చర్మం, నరాలకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది అల్జీమర్స్ ,  అభిజ్ఞా క్షీణత వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉడికించిన వేరుశెనగలో విటమిన్ ఎ, విటమిన్ బి లు మెండుగా ఉంటాయి. ఇవి కండరాలను, అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. అర కప్పు ఉడికించిన పల్లీలను తింటే మీరోజువారీ థయామిన్ అవసరాలు తీరుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved