MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Feature
  • Astro tips: స్నానం చేసే నీళ్లలో వీటిని కలిపారంటే.. మీకు అదృష్టం వరిస్తుంది

Astro tips: స్నానం చేసే నీళ్లలో వీటిని కలిపారంటే.. మీకు అదృష్టం వరిస్తుంది

కష్టపడినా ఆశించిన ఫలితాలను పొందని వారు చాలా మందే ఉంటారు. వాస్తు ప్రకారం.. కొన్ని పనులను చేస్తే మీరు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు రోజూ స్నానం చేసే నీళ్లలో కొన్నింటిని కలిపి స్నానం చేస్తే దురదృష్టం కాస్త అదృష్టంగా మారుతుంది.
 

Shivaleela Rajamoni | Published : Nov 29 2023, 09:56 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

హిందూ మతంలో జ్యోతిష్యాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. జ్యోతిష్య నియమాలను పాటిస్తే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం..  స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపితే మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

25
Asianet Image

పచ్చిపాలు

అవును స్నానం చేసే నీటిలో పచ్చిపాలను కలిసి స్నానం చేస్తే రోగాలు దరిచేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఇలా స్నానం చేసేవారి వయస్సు కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కంటిచూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదట.
 

35
Asianet Image

పసుపు

చిటికెడు పసుపు కలిపి నీటితో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. దీంతో మీరు విధిలో సానుకూల మార్పులను చూస్తారు. పసుపుతో పాటుగా గంధాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మీ అదృష్టం బాగుంటుంది.
 

45
Asianet Image

ఉప్పు

మీరు రోజూ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ మీ నుంచి దూరమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

55
Asianet Image

రోజ్ వాటర్

రోజ్ వాటర్ మన అందాన్ని పెంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అయితే ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనాలను పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం.. ఇలా స్నానం చేయడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాగే యాలకులను నీటిలో వేసి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories