` కేజీఎఫ్ 3` గూస్ బంమ్స్ అప్ డేట్.. రాకీ భాయ్ రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందంటే?
KGF 3 Update: `కేజీఎఫ్ 2` విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ `కేజీఎఫ్ 3` గురించి హింట్ ఇచ్చింది. ఈ వీడియో సినిమా ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచింది, రాకీ భాయ్ మళ్లీ వస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ మూవీ ఎప్పుడు రాబోతుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో `డ్రాగన్` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత పలు కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఏ మూవీ ఫస్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
KGF 3 Update
KGF 3 Update:`కేజీఎఫ్` సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు `టాక్సిక్` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతలో మరో అప్డేట్ వచ్చింది. 'కేజీఎఫ్ 2' మూడు ఏళ్లు పూర్తి చేసుకుంది. `కేజీఎఫ్ 3`కి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది టీమ్.
kgf 3
బ్లాక్బస్టర్ చిత్రం 'కేజీఎఫ్ అధ్యాయం 2' ఏప్రిల్ 14, 2022న విడుదలైంది. ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రెడీ అయింది. గతాన్ని గుర్తు చేస్తూ కొత్త అప్ డేట్ ఇచ్చింది. `కేజీఎఫ్` లవర్స్ కి గూస్ బంమ్స్ తెప్పించే వీడియో విడుదల చేసింది.
kgf 3
ఈ వీడియోలో కేజీఎఫ్ చివరి అధ్యాయం గురించి హింట్ ఇచ్చారు.. 'అతను వచ్చాడు... అతను చూశాడు... అతను జయించాడు!' అని రాశారు. 2.15 నిమిషాల ఈ వీడియోలో హీరో మాసివ్ ఎంట్రీ ఉంది. ఇందులో `కేజీఎఫ్ః ఛాప్టర్ 3` అని ఉండటంతో ఇక మూడో పార్ట్ కి రంగం సిద్ధమైందని అనిపిస్తుంది. త్వరలోనే రాబోతుందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
kgf 2
ప్రస్తుతం `కేజీఎప్ 3`కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాకీ భాయ్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సారి విధ్వంసం వేరే లెవల్లో ఉండబోతుందని అంటున్నారు. అయితే `కేజీఎఫ్ 2`లోనే హీరో చనిపోయాడు. మరి మూడో పార్ట్ లో ఏం చూపించబోతున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది. ప్రీక్వెల్ అంశాలను చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది.
kgf 3
`కేజీఎఫ్ అధ్యాయం 3` గురించి చాలా రోజులుగా ప్రశ్నలు ఉన్నాయి. `కేజీఎఫ్-3` వస్తుందా? అని చాలాసార్లు చిత్ర బృందాన్ని అడిగారు. సినిమా మూడో భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం చివరి నాటికి మూడవ అధ్యాయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు కేజీఎఫ్, కేజీఎఫ్ 2 అభిమానుల నుండి ఎక్కువ ఆదరణ పొందింది.
kgf 2
ఇదిలా ఉంటే హోంబలే ఫిల్మ్స్ ఊరిస్తుంది కానీ, ఇప్పట్లో ఈ మూవీ ఉంటుందా? అనేది పెద్ద సందేహంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `సలార్ 2` చేయాల్సి ఉంది.
వీటితోపాటు అల్లు అర్జున్, రామ్ చరణ్లతోనూ సినిమాలున్నాయనే రూమర్స్ ఉన్నాయి.ఈ క్రమంలో `కేజీఎఫ్ 3` ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ `డ్రాగన్` తర్వాత `కేజీఎఫ్ 3` చేస్తారా? `సలార్ 2` చేస్తారా? అనేది సస్పెన్స్. ప్రశాంత్ నీల్పైనే ఇదంతా ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
kgf 2
కేజీఎఫ్ 2018 చివరిలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ150 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 'కేజీఎఫ్-2' 4 సంవత్సరాల తర్వాత విడుదలై `కేజీఎఫ్ 2` బాక్సాఫీసుని షేక్ చేసింది. ఇది రూ.1200కోట్లు వసూలు చేసింది. కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇప్పుడు `కేజీఎఫ్ 3` ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.