సాయం విషయంలో పల్లవి ప్రశాంత్ మళ్ళీ సైలెంట్... రైతు బిడ్డ ఇలా చేస్తాడని అనుకోలేదు!
పల్లవి ప్రశాంత్ మరలా సైలెంట్ అయ్యాడు. రైతులకు సాయం చేస్తానని చెప్పి ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి..
Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి దాదాపు నాలుగు నెలలు అవుతుంది.టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులు గెలిచాడు.
Pallavi Prashanth
ఎవరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫస్ట్ టైం ఒక కామనర్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి కప్పు ఎగరేసుకుపోయాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఒక హామీ ఇచ్చాడు. తాను కనుక టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు దానం చేస్తానని అన్నాడు.
ఫైనల్ కి వెళ్లిన ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. దాంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఇందులో టాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వస్తాయి. ఈ మొత్తాన్ని పల్లవి ప్రశాంత్ పేద రైతులు పంచాల్సి ఉంది.
అయితే ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ఒక లక్ష రూపాయలు మాత్రమే పంచాడు. కొద్దిరోజుల క్రితం పల్లవి ప్రశాంత్ అనాథలైన ఇద్దరు బాలల పేరిట రూ. 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అలాగే ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.
మరికొందరు పేద రైతులకు సహాయం చేసి వీడియోలు పోస్ట్ చేస్తానని వెల్లడించాడు. నెలలు గడుస్తున్నా మరో సహాయం చేయలేదు. దాంతో పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిగతా డబ్బులు ఎప్పుడు సహాయం చేస్తావని కామెంట్స్ చేస్తున్నారు.
Pallavi Prashanth
మరోవైపు పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు..