- Home
- Entertainment
- Folk Song : నాగదుర్గ కంటే ముందే యూట్యూబ్ ను షేక్ చేసిన తోపు, మూడు పాటలకే 35 కోట్ల వ్యూస్! ఎవరీ శిరీష?
Folk Song : నాగదుర్గ కంటే ముందే యూట్యూబ్ ను షేక్ చేసిన తోపు, మూడు పాటలకే 35 కోట్ల వ్యూస్! ఎవరీ శిరీష?
Telangana Folk Song : ప్రస్తుతం యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ అని సెర్చ్ చేయగానే నాగదుర్గ కనిపిస్తుంది. కానీ ఆమెకంటే ముందు ఓ ఫోక్ సింగర్ యూట్యూబ్ సామ్రాజ్యాన్ని ఏలింది. ఆమె టాప్ 3 సాంగ్స్ ఏకంగా 35 కోట్ల వ్యూస్ సాధించాయి. అంత తోపు ఫోక్ సింగర్ ఎవరో తెలుసా?

ఫోక్ లో నాాగదుర్గ కంటే తోపు... ఎవరీ శిరీష?
Folk Singer Shirisha : ప్రస్తుతం సినిమా పాటలకంటే జానపద పాటలకే క్రేజ్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్ లో ఇలా పెట్టగానే అలా లక్షలు, కోట్ల వ్యూస్ సాధిస్తున్న ఫోక్ సాంగ్స్ అనేకం ఉన్నాయి. ''రాను బొంబైకి రాను'', ''పేరుగల్ల పెద్దిరెడ్డీ బిడ్డనో ఓ రామ చిలకా'', ''ఓ పిలగ యెంకటేశు'' వంటి పాటలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చూశాం. ఇటీవల వచ్చిన ''బాసింగ బలాలే'' సాంగ్ కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ సినిమా హీరోయిన్ స్థాయికి చేరిందంటేనే తెలంగాణ జానపదాలు ప్రజల్లో ఏ స్థాయి అభిమానాన్ని పొందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
'ఇడుపు కాగితం' సినిమా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన నాగదుర్గ పేరు సినీ వర్గాల్లో, అభిమానుల్లో బాగా వినిపిస్తోంది. అయితే నాగదుర్గ కంటే ముందే ఓ తెలంగాణ అమ్మాయి యూట్యూబ్ ను షేక్ చేసింది... ఆమె పాట విడుదలైతే చాలు కోట్ల వ్యూస్ పక్కా అనే అభిప్రాయం ఉండేది. ఆమె ఒకే ఒక్క పాట యూట్యూబ్ లో 20 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉందంటేనే ఎంతలా అభిమానించేవారో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎవరో కాదు దీకొండ శిరీష. తన అందం, అభినయంతోనే కాదు గాత్రంతో అభిమానుల మనసు కొల్లగొట్టేది శిరీష. అసలు ఈమె ఎవరు? ఈమె టాప్ 3 హిట్ సాంగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం.
ఎవరీ ఫోక్ సింగర్ శిరీష?
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం దీకొండ శిరీష స్వస్థలం. ఆర్ఎంపి గా పనిచేసే అశోక్, నీరజ దంపతుల ముగ్గురు బిడ్డలలో శిరీష ఒకరు. చిన్నప్పటి నుండే జానపద పాటలను ఇష్టపడే శిరీష గురుకుల పాఠశాలలో చదివే సమయంలో మరింత ఇష్టాన్ని పెంచుకుంది. పెద్ద పిల్లలతో కలిసి ప్రత్యేకంగా మ్యూజిక్ నేర్చుకునేది... ఆమె ఆసక్తిని గమనించిన టీచర్లు, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో ఇప్పుడు టాప్ ఫోక్ సింగర్లలో ఒకరిగా నిలిచింది.
కేవలం తెలంగాణ జానపదాలకు తన గొంతులోని మాధుర్యాన్ని పంచడమే కాదు... అద్భుతమైన డ్యాన్స్, హావభావాలతో మరో లెవల్ కు తీసుకెళుతుంది శిరీష. ఈమె జనపద పాటలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. యూట్యూబ్ లో శిరీష ఆడిపాడిన పాటలు కోట్ల వ్యూస్, లక్షల లైక్స్ సాధించాయి. అలాంటి టాప్ 3 పాటలేవో చూద్దాం.
1. యేమే పిల్ల సాంగ్
దీకొండ శిరీషకు జానపద గాయనిగా టాప్ లో కూర్చోబెట్టిన సాంగ్ 'యేమే పిల్ల'. పల్లెటూరి బావామరదల్ల మధ్య సాగే ప్రేమను తెలియజేసేలా ఈ సాంగ్ సాగుతుంది.... ఇందులో శిరీష డ్యాన్స్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది.
''యేమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు.... గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనే సుక్కల తానాలు...
నువ్వు పిలిసే పిలుపులు తెరిసెనే గుండె తలుపులు...
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో... నీదానివరి పేరు పెట్టుకో''
అంటూ సాగుతుంది ఈ పాట. సై టివి యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ సాంగ్ ఏకంగా 189 మిలియన్స్ అంటే 18 కోట్ల 90 లక్షల వ్యూస్... 559k లైక్స్ సాధించి యూట్యూబ్ నే షేక్ చేసింది.
2. బావల్ల నా బావల్ల సాంగ్
శిరీష ఆడిపాడిన మరో అద్భుతమైన జానపదం ఈ బావల్ల నా బావల్ల సాంగ్. ''గున్నాగున్నా మామిల్లల్ల గున్నామామిడి తోటల్ల... మాపాటేల మందలియ్య రాయే నువ్వు బావల్ల...'' అంటూ సాగే ఈ పాట కూడా సై టివి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ జానపద పాటకు కూడా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు... యూట్యూబ్ లో 124 మిలియన్స్ అంటే 12 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోయింది. 388k లైక్ సాధించింది.
3. ఉయ్యాలో టుంగుటుయ్యాలో సాంగ్
''అత్తగారింటికి కొత్తగవోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో... గుత్తెంగ నారైకె గుట్టాలే టైలరు ఉయ్యాలో టూగుటుయ్యాలో'' అంటూ సాగే మరో సూపర్ హిట్ ఫోక్ శిరీష ఖాతాలో ఉంది. ఇది Gaddam Music (గడ్డం మ్యూజిక్) యూట్యూబ్ ఛానల్లో విడుదలయ్యింది. ఇప్పటివరకు 57 మిలియన్స్ అంటే 5 కోట్ల 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది... 153k లైక్స్ వచ్చాయి. ఇలా తెలంగాణ జానపదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి శిరీష సాంగ్స్.

