టాయిలెట్ మగ్తోనే టీ తాగే వాణ్ని.. సంచలన విషయాలు చెప్పిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ స్టార్గా అవతరించాడు సల్మాన్ ఖాన్. తన ప్రతీ సినిమాకు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సల్మాన్ భాయ్ తన జీవితంలో వచ్చిన చేదు అనుభవాల గురించి మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ పలు సంచలన విషయాలను వెల్లడించాడు.
సల్మాన్ ఖాన్ 1998 అక్టోబర్లో జోధ్పూర్లోని కంకణి ప్రాంతంలో హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదికల ప్రకారం, కృష్ణ జింకలను చంపిన కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ ఇప్పుడు బెయిల్పై ఉన్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పాత వీడియోలను షేర్ చేసుకుంటున్న అభిమానులు సల్మాన్కు సంబంధించి వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియోలో సల్మాన్ జైలులో ఉన్నప్పటి తన అనుభవాలను పంచుకున్నాడు. 2008లో హెడ్లైన్స్ టుడే ఈ ఇంటర్వ్యూను చేసింది.
ఈ సందర్భంగా వ్యాఖ్యత సల్మాన్ ను జైలు ఉన్న సమయంలో మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సల్మాన్ నాకు చాలా సరాదాగా అనిపించింది అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సల్మాన్. జైలులో ఉన్న సమయంలో తాను ఉదయం టీ తాగిన కప్పునే తరువాత టాయిలెట్ను వాడుకోవాల్సి వచ్చేది అని చెప్పాడు.
జైలులో ఉన్నప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను. కానీ ఒక్క బాత్ రూమ్ విషయంలోోనే ఇబ్బందిగా ఉండేది. పది మంది ఉండే పది రూమ్లకు ఒకే ఒక్క బాత్ రూం ఉండేది. ఉదయం టీ, టిఫిన్ ఓ వ్యక్తి తీసుకువస్తాడు. టీ తాగిన తరువాత అదే కప్పును కడిగి దానినే బాత్రూమ్లోనూ యూజ్ చేసుకోవాలి. అంటూ తను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు.
అయితే ఆసమయంలోనూ తాను ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నానని చెప్పాడు సల్మాన్. రోజు పుష్అప్స్చ క్రంచెస్ చేస్తూ ఫిట్నెస్ కాపాడుకున్నానని చెప్పాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ఇటీవల దబాంగ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తరువాత ప్రభుదేవా దర్శకత్వంలో రాథే సినిమాలో నటిస్తున్నాడు కండల వీరుడు.