ఆమెతో ఎఫైరే విడాకులకు కారణం.. అసలు విషయం చెప్పిన హీరోయిన్
స్టార్ కపుల్ దిలీప్, మంజు వారియర్లు 16 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2015లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటో చాలా కాలం తరువాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మంజు వారియర్.
మలయాళ నటి మంజు వారియర్ తన మాజీ భర్త దిలీప్తో విడాకులకు కారణాలను వెల్లడించింది. దిలీప్కు కావ్య మాధవన్తో ఉన్న రిలేషన్ కారణంగానే విడాకులు తీసుకున్నట్టుగా వెల్లడించింది మంజు.
నటి భావనను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో దిలీప్ను అరెస్ట్ చేసిన సమయంలో మంజు వారియర్ను కూడా విచారించారు. ఆ సమయంలోనే ఆమె ఈ విషయాలను వెల్లడించింది.
దిలీప్, కావ్యల మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన కొన్ని మెసేజ్లు చూసిన తరువాతే వారిద్దరి మధ్య రిలేషన్ ఉన్న విషయం తనకు తెలిసిందని మంజు పోలీసులకు వెల్లడించింది.
ఆ మెసేజ్లు చూసిన తరువాత తాను ఆ విషయాన్ని గీతు మోహన్దాస్, సంయుక్తా వర్మ, కావ్యకు కూడా తెలియజేసినట్టుగా మంజు తెలిపింది.
కావ్య మాటలు విన్న తరువాత తనకు వారి రిలేషన్ గురించి క్లారిటీ వచ్చిందని చెప్పింది మంజు వారియర్.
అయితే దిలీప్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశాడు.
దిలీప్, మంజు 1998 అక్టోబర్ 20న పెళ్లి చేసుకున్నారు. 2015 జనవరిలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.,
అయితే ఈ విషయాలపై స్పందించిన దిలీప్, దేవుడి మీద ప్రమాణం చేసి మరీ తమ వైవాహిక జీవితంలో ఇబ్బందులకు కావ్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.