మహేష్ బాబు భార్య నా మీద దాడి చేసింది.. హీరోయిన్ సంచలన ఆరోపణ
మలైకా అరోరా గతంలో తన చెల్లి అమృతా అరోరాతో కలిసి ఓ టాక్ షోలో పాల్గొంది.. ఈ షోలో మలైకా ఓ వ్యక్తి గురించి చెప్పిన సమాధానం అందరినీ షాక్కు గురిచేసింది.
బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా తన రిలేషన్షిప్ వార్తలతో ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె బిఎఫ్ఎఫ్ విత్ వోగ్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, నటి నమత్రా శిరోద్కర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ షోలో తన సోదరి అమృత అరోరాతో కలిసి పాల్గొంది మలైకా. మీరు అర్ధం కానీ వ్యక్తుల గురించి చెప్పమని కోరింది హోస్ట్ నేహ.
అయితే అందుకు సమాధానంగా మలైకా, నమ్రతా శిరోద్కర్, 90ల నాటి ప్రముఖ మోడల్ జెస్సియాల పేర్లు చెప్పింది. జెస్సియా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ భార్య. మలైకా మోడలింగ్ లోకి వచ్చిన కొత్తలో అప్పట్లో సీనియర్లుగా ఉన్న నమత్ర, జెస్సీయ ా సరిగా చూసుకోలేదని ఆమె ఆరోపించింది.
ఒకప్పుడు నమత్ర తన ఫ్రెండ్స్తో కలిసి తన మీద దాడి చేసిందని కూడా మలైకా ఆరోపించింది. నమ్రత, మెహర్లు తనకు ఇప్పటికీ అర్ధం కాలేదని, కానీ కొంత కాలానికి నమత్ర తనకు మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పింది. ప్రస్తుతం ఆ ఇద్దరితో తనకు మంచి సంబంధాలు ఉన్నట్టుగా చెప్పింది మలైకా.
అదే టాక్ షోలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ గాసిప్లు మాట్లాడటం మానేయాలని చెప్పింది కరీనా కపూర్.
కరీనా మలైకాకు మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. వీరు తరుచూ పార్టీలలో కలుసుకుంటూ ఉంటారు.