నేను డ్రగ్స్కు బానిసయ్యా.. సంచలనం సృష్టించిన స్టార్ హీరో కామెంట్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్లో డ్రగ్స్కు సంబంధించిన చర్చ జరుగుతోంది. దీంతో బాలీవుడ్ సహా ఇండస్ట్రీలలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో సైఫ్ తాను డ్రగ్స్కు బానిసైన విషయం వెల్లడించిన సంగతి ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారంలో డ్రగ్స్ కోణం తెర మీదకు రావటంతో సైఫ్ అలీఖాన్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది.
గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫిలిం కెరీర్తో పాటు పర్సనల్ విషయాలను కూడా వెల్లడించాడు సైఫ్. ఇందులో పలు సంచలన విషయాలు కూడా ఉన్నాయి.
తాను గతంలో ఎల్ఎస్డీ అనే డ్రగ్ను వాడాను అని చెప్పాడు సైఫ్. అప్పట్లో తన భయాల నుంచి బయట పడేందుకు ఈ పని చేశానని చెప్పాడు.
తాను 22 ఏళ్ల వయసులోనే ఎల్ఎస్డీ వాడానని చెప్పి షాక్ ఇచ్చాడు సైఫ్.
అంతేకాదు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరెన్నో విషయాలను కూడా వెల్లడించాడు. గతంలో తన మీద ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్లో దాడి జరిగిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించాడు.
ఓ వ్యక్తి ఢిల్లీ నైట్ క్లబ్లో సైఫ్ దగ్గరకు వచ్చి తన ప్రియురాలితో డ్యాన్స్ చేయమని కోరాడు. దానికి సైఫ్ నో చెప్పాడు. ఆ విషయంలోనే వివాదం జరిగింది.
ఆ వ్యక్తి నీకు అందమైన అమ్మాయి దొరికితే డ్యాన్స్ చేయనంటావా అంటూ హద్దులు మీరు మాట్లాడటం ప్రారంభించాడు. అంతేకాదు విస్కీ బాటిల్తో సైఫ్ తల మీద బలంగా కొట్టడంతో గాయమైంది.
ఆ వ్యక్తిని ప్రతిఘటించేందుకు తాను ఎంత ప్రయత్నించినా అతను మళ్లీ మళ్లీ దాడి చేశాడని.. చెప్పాడు సైఫ్. అతడు ఓ సైకోలా ప్రవర్తించాడని ఆ రోజు జరిగిన సంఘటనను వివరించాడు.
సైఫ్ తాజాగా దిల్ బెచారా సినిమాతో అతిధి పాత్రలో కనిపించాడు. బంటీ ఔర్ బబ్లీ 2, భూత్ పోలీస్ సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఈ బాలీవుడ్ స్టార్ పలు సౌత్ సినిమాలకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
తాజాగా తాను మరోసారి తండ్రి కాబోతున్నట్టుగా ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు సైఫ్ అలీఖాన్.
సైఫ్ రెండో భార్య కరీనా కపూర్, తన రెండో బిడ్డకు త్వరలోనే జన్మనివ్వనుంది.