పేరు పెట్టి పిలుస్తారేంటి.. మీ క్లాస్మెటా..? మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్ అత్తగారు!
కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు కూడా కంట్రోల్ కోల్పోతుంటారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అలాంటి సంఘటనే జరిగింది. మీడియా ప్రతినిథులు ఐశ్వర్య రాయ్ను పేరు పెట్టి పిలిచినందుకు జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు మీకోసం.
జయా బచ్చన్ తన వివాాదాస్పద ప్రవర్తనతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మీడియా ఫోటోగ్రాఫర్లతో ఆమె దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు చాలా ఉన్నాయి. తన ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిథులకు ఆమె చాలా సార్లు క్లాస్ తీసుకుంది.
అలా ఒక సందర్భంగా సుభాష్ ఘయ్ ఏర్పాటు చేసిన పార్టీకి కోడలు ఐశ్వర్య తో కలిసి వెళ్లిన సందర్భంలో కూాడ జయా మీడియా మీద ఫైర్ అయ్యింది.
ఐశ్వర్య రాయ్ను పేరు పెట్టి పిలిచినందుకు ఆమె మీడియా ప్రతినిథుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. `ఐశ్వర్య అని పిలుస్తున్నారు. ఆమె మీ క్లాస్మెటా..?` అంటూ వారి మీద విరుచుకుపడింది. అయితే ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. తాజాగా లాక్ డౌన్ సమయంలో ఈ వీడియో మరోసారి సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది.
అయితే ఈ వివాదంపై అభిషేక్ హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. తన తల్లి ఐశ్వర్యను ఐష్ అని పిలిచినందుకే ఆగ్రహం వ్యక్తం చేసిందని క్లారిటీ ఇచ్చాడు.
అయితే అక్కడ ఉన్న వారు మాత్రం ఐష్ అని పిలిచినందుకు కాదు, ఐశ్వర్యను మేడమ్ అని పిలవనందుకే జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.