సాయి పల్లవి గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు!
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్తో గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తరువాత టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ గురించి అభిమానులకు తెలియని కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం.
ప్రస్తుతం బిజీ హీరోయిన్గా ఉన్న సాయి పల్లవి, తన పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్తో పాటు, డ్యాన్సింగ్ స్కిల్స్తో అందరి దృస్టిని ఆకర్షించింది. ఈ అందాల భామ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఎంతో సిగ్గుపడేది. కానీ కెమెరా ముందుకు వచ్చిన తరువాత కొద్ది రోజుల్లోనే తనను తాను ఎంతో మార్చుకుంది.
ఢీ షోల పాల్గొనేందుకు సాయి పల్లవి ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. అయితే ఆమె చదువు పాడవుతుందే అన్న భయంతో తల్లి ఆ షోలో పాల్గొనేందుకు అంగీకరించలేదట.
సాయి పల్లవి తొలి సినిమా ప్రేమమ్ కాదు. అంతకన్నా ముందే ఓ సినిమాలో సపోర్టింగ్ రోల్లో కనిపించింది. కంగనా రనౌత్ ఫ్రెండ్గా ధామ్ ధూమ్ సినిమాలో నటించింది సాయి పల్లవి.
తొలిసారి తాను అంటెండ్ అయిన ఇంటర్వ్యూ సమయంలో తనకు ఏ మాత్రం కాన్ఫిడెన్స్ లేదని చెప్పింది సాయి పల్లవి. ముఖ్యంగా తన స్కిన్ సమస్య కారణంగా తనలో ఆ భావం ఉండేదని చెప్పింది.
ఇంత గొప్ప డ్యాన్సర్గా పేరున్న సాయి పల్లవి ఎక్కడా డ్యాన్స్ నేర్చుకోలేదట. కేవలం టీవీలో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ల డ్యాన్స్ చూసి ఆ రేంజ్లో డ్యాన్స్ నేర్చుకుందట.
ముందుగా ఢీ జోడి షో ప్రొమోలో మెరిసిన ఈ భామ తరువాత ఢీ సీజన్ 4కు సెలెక్ట్ అయ్యింది.
సాయి పల్లవి కార్డియాలజిస్ట్ కావాలనుకుంది. ఇటీవల జార్జియాలో మెడిసిన్ కూడా పూర్తి చేసింది.
ప్రేమమ్ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ మలారే తన మీద చిత్రీకరిస్తాని ముందుగా తెలియదు. కానీ ఆ పాటలో కనిపించబోయేది తానే అని తెలిసిన తరువాత చాలా సంతోషించిందట.
ప్రేమమ్ సినిమా కోసం అల్ఫోన్స్ సాయి పల్లవిని సంప్రదించినప్పుడు, సపోర్టింగ్ రోల్స్ కోసమని భావించింది సాయి పల్లవి.
సాయి పల్లవి తమిళనాడులోని కోటగిరి ప్రాంతానికి చెందిన బడగా కమ్యూనిటీకి చెందిన యువతి. ఆ కమ్యూనిటీలో ఆ స్థాయి స్టార్డమ్ సాధించిన మొదటి మహిళ సాయి పల్లవే.
అందరూ భావించినట్టుగా సాయి పల్లవి మలయాళీ కాదు, ఆమె తమిళనాడుకు చెందింది. ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకోవటం, రంగోళీలు దిద్దటం సాయిపల్లవికి ఎంతో ఇష్టం.