Ennenno Janmala Bandham: వేద కోసం వంట చేసిన యష్.. ఖుషి ముందు గ్రేట్ పేరెంట్స్ గా నాటకాలు!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వేద (Vedha) ఖుషి విషయంలో యష్ (Yash) ప్రవర్తన గురించి బాధపడుతూ వాళ్ల అక్క బావలకు పంచుకుంటుంది. ఇక ఖుషి కి అమ్మ మాత్రమే కాదు యష్ కి భార్య వి కూడా.. నీ భర్తని బుజ్జగిస్తావో బుద్ధి చెబుతావో.. ఎలాగైనా నువ్వే మార్చాలి అని వేదకు వాళ్ల బావ గారు చెబుతారు.
ఇక వేద (Vedha), యష్ (Yash) లు ఒక దగ్గర కలుసుకొని ఖుషి కోసం మనం కోపతాపాలకు దూరం పెట్టుకోవాలి ఇగో కి పోకూడదు అని అనుకుంటారు. ఆ క్రమంలో వీరిద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. దానితో యష్ ఖుషి నా కూతురు తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని అంటాడు.
అంతేకాకుండా నాకు.. ముందు నా కూతురు ఆ తర్వాతే నువ్వు అని వేద (Vedha) ను అంటాడు. ఇక వేద కూడా నేను ఖుషి (Khushi) కోసమే మీకు భార్యగా అయ్యాను అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు తార మాళవిక తో నీ గురించి అలకనంద అపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఫోన్ చేసి నెగిటివ్ గా చెబుతున్నారు అని అంటుంది.
ఇక యష్ (Yash) దగ్గరకు మాలిని వచ్చి నీ కూతురు మొహంలో చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకో నానా అప్పుడు నువ్వు తండ్రి గా గెలిచినట్టే అని అంటుంది. మరో వైపు అభిమన్యు (Abhimanyu) రేపు ఖుషి వాళ్ళ స్కూల్ లో స్టేజ్ మీద యష్ ఘోరంగా అవమాన పడేలా చేస్తాను అని మాళవిక తో అంటాడు.
మరోవైపు యష్ (Yash) స్వయంగా వేదకు నేను దోస వేసి పెడతాను దోస పిండి ఎక్కడ అని అత్తగారిని అడుగుతాడు. ఇక వేద (Vedha) కోసం యష్ దోసె వేస్తూ.. అది ఖుషి కి కూడా తెలిసేలా పెద్దగా చెబుతూ ఉంటాడు. ఇక ఖుషి ను ఎలాగైనా కూల్ చేయాలనీ అనుకుంటాడు.
తర్వాత యష్ (Yash) శ్రీమతి గారి కోసం దోసెలు వేశాను అంటూ వేద (Vedha)కు వడ్డీస్తాడు. ఇక ఖుషి డాడీ నీ కోసం కష్టపడి వేశారు కదా తనకు కూడా తినిపించు అని అంటుంది. దాంతో వేద చేతితో యష్ కి తినిపిస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.