Guppedantha Manasu: రిషి మాటలకు కుమిలిపోతున్నమహేంద్ర..నిజం చెప్పడానికి ట్రై చేసిన వినిపించుకొని ఈగో మాస్టర్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మహేంద్ర సోఫా మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అంతలో జగతి అక్కడికి వచ్చి ఓదారుస్తుంది. అప్పుడు మహేంద్ర,జగతితో నేను ఏమైనా తప్పు చేశాన జగతి,నేను కోరుకున్న దాంట్లో స్వార్థం ఏమైనా ఉన్నదా? దానికి రిషి నేను ఏదో జరగకూడని తప్పు చేసినట్టు, జీవితంలో క్షమించరానంత తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడు, నిజం చెప్పే అవకాశం కూడా రిషి నాకు ఇవ్వలేదు అని అనగా జగతి, ప్రతీసారి బాధపడి ఎదుటి వాళ్ళను సమాధానం పరచలేము మహేంద్ర.అయినా బాధలో ఓదార్పుగా ఉండాల్సింది మనుషులు కాదు కన్నీళ్లు.
ఎంత ఏడుస్తే అంత బాధ తగ్గుతుంది,మనసు బరువు దిగేలా ఏడు మహేంద్ర అని అనగా మహేంద్ర, జగతి భుజం మీద పడుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర మల్లి లేచి, నేను చేసిన తప్పేంటి అని అంటాడు. ఇప్పుడు దాని గురించి ఇంక వదిలే అని జగతి అంటుంది. ఇంతలో గౌతమ్,ధరణి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వసుధార కనిపించడం లేదు, ఇల్లంతా వెతికాము ఎక్కడా లేదు మీరు ఏమైనా చూశారా అని అంటారు. మేము ఎవరు చూడలేదు ఒకవేళ ఇంటి నుంచి వెళ్లిపోయిందా అని అనగా, ఎవరికి చెప్పకుండా వసు బయటికి వెళ్ళదు నాతో చెప్పకుండా అసలు వెళ్ళదు అని జగతి అంటుంది. ఒకసారి రిషి ని అడుగుదామా రిషి వెళ్ళిపోమన్నాడ? అని మహేంద్ర రిషి దగ్గరకి వెళ్తుండగా జగతి మహీంద్రని ఆపి, గౌతమ్ తో నువ్వు వెళ్లి అడుగు గౌతమ్ నెమ్మదిగా మాట్లాడు అని అంటుంది.
అప్పుడు ధరణి, నేను ఒకసారి అత్తయ్య గారిని వెళ్లి అడగనా అని అనగా జగతి, వద్దు ధరణి మనం ఏం చేసినా అది తనకు అనుకూగా మార్చుకుంటున్నారు ఇంక వదిలే అని అంటుంది.మరో వైపు రిషి తన గదిలో జరిగిన విషయం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి, వసుధార నీ చూసావా? కనిపించడం లేదు అని అడగగా ఏమో అని అంటాడు రిషి.అందరూ ఎంత భయపడుతుంటే ఏమో అంటావ్ ఏంట్రా? నువ్వు ఏమైనా వెళ్ళిపోమన్నావా? అని గౌతమ్ అడగగా నేను ఎందుకు వెళ్ళిపోమంటారా? అందరూ ఉన్నారు కదా వెళ్లి వెతకండి అని గౌతమ్ తో అంటాడు రిషి. గౌతం వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.ఆ తర్వాత సీన్ లో వసు,డాబా మీద లైట్ బెలూన్ల నీ గాల్లోకి ఎగరడానికి తయారుచేస్తుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు. ఒక మూల నుంచి దాన్ని చూస్తున్న రిషి గతంలో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటాడు.
గతంలో రిషి,వసు ఇలాగే ఆ లైట్ బెలూన్ ని గాల్లోకి పంపుతూ, ఇలా మనం చేసి మనసులో ఎవరి గురించి అయినా మంచి కోరుకుంటే అది నెరవేరుతుందట అని ఒకసారి వసు చెప్పిన మాటలు గుర్తొస్తాయి రిషికి. అదే సమయంలో వసు, నేను అనుకున్న పని జరగాలి. రిషి సార్, జగతి మేడంని అమ్మ అని పిలవాలి అని అంటుంది. అప్పుడు రిషి కి కోపం వస్తుంది. ఇంతలో వసు దగ్గరికి వెళ్తాడు రిషి. వసు రిషిని చూసేసరికి రిషి మొఖం అటు వైపు తిప్పుకుంటాడు.ముఖం కూడా చూపించలేనంత తప్పు ఏం చేశాను సర్ అని రిషి అనగా,తప్పులు గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అని అంటాడు రిషి. అప్పుడు వసు,నేను ఏం కోరుకున్నానో తెలుసా అని అనగా,ఊహించగలను. వసుధార, ఆ కోరిక నెరవేరాలని నువ్వు ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా అని అడగగా, అవును సార్ అందులో తప్పేమీ లేదు కదా అని అంటుంది వసు. తప్పొప్పుల గురించి ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పాను కదా వసుధార అని అంటాడు రిషి.
నన్ను మాట్లాడనివ్వండి సార్ అని వసు అనగా,ఇప్పుడు వద్దు చాలా లేట్ అయింది. అందరూ నీకోసం కంగారుపడుతున్నారు గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి.ఆ తర్వాత సీన్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా రిషి బయటకు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని దేవయాని అడగగా, చిన్న పని ఉన్నది పెద్దమ్మని వెళ్తాడు కూడా రిషి. వెనకాతలో వసు కూడా వెళ్తుండగా దేవయాని వసూని ఆపి,నువ్వు ఇంటికి వచ్చావు, జగతి మహీంద్రలు పెళ్లిరోజు జరిపించావు. బహుమతి తీసుకోకుండా వెళ్తే ఎలాగా పరాయి వాళ్ళని ఉట్టి చేతులతో పంపించడం మాకు ఆనవాయితీ లేదు అని దేవయాని అనగా మహేంద్ర కోపంగా లెగుస్తాడు. ఇంతలో గౌతమ్ మహేంద్రని కూర్చోబెట్టేస్తాడు.ఎంత ఇంట్లో వాళ్లకి నువ్వు ఏ సంబంధం లేకపోయినా పెళ్లి రోజు జరిపించి, ఏదో కాస్త పనులు చేసావు కదా, ధరణి వెళ్లి పూలు,పళ్ళు చీర తీసుకురా అని పంపిస్తుంది దేవయాని. ఇంతలో రిషి కారులో వసు కోసం వేచి చూస్తూ ఉంటాడు.అప్పుడు ధరణి వచ్చి ప్లేట్ తో పళ్ళు ఇస్తుంది.
అప్పుడు దేవయాని నీ చేతులతో నువ్వే ఇవ్వు జగతి. ఎంతైనా నీ శిష్యురాలు కదా అని జగతి చేత ఇప్పిస్తుంది దేవయాని.జగతి వసుకి ఇస్తుంది.అప్పుడు వసుధారా, నేను గుర్తుంచుకుంటాను మేడం అని దేవయాని చూసి అంటుంది. అదే మీరు ఇచ్చినవన్నీ గుర్తుంచుకుంటాను అని అంటుంది వసు. ఇంతలో ధరణి,అవన్నీ బ్యాగ్ లో పెట్టి ఇస్తాను అని వసుధార దగ్గర ఆ ప్లేట్ తీసుకుంటుంది ధరణి. అప్పుడు లోపలికి వెళ్లి స్వీట్ తెచ్చి,వెళ్తున్న వాళ్ళకి నోరు తీపి చేస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు అంటారు కదా అని కావాలని వస కి స్వీట్ ఇప్పిస్తుంది ధరణి.తర్వాత వసు కార్ ఎక్కిపోయింది.
అప్పుడు ధరణి బ్యాగ్ మర్చిపోయింది అని అనుకుంటుంది.అప్పుడు రిషి,వసు ఇద్దరు కారులో కూర్చుంటారు. అప్పుడు వసు మనసులో, రిషి సార్ తో మాట్లాడి ఎలాగైనా మనస్పర్ధలు తొలగించుకోవాలి అని అంటుంది. అప్పుడు రిషి, వసుధార ఏది మాట్లాడట్లేదు ఏంటి అని అనుకుంటాడు. ఆ తర్వాత రిషి వసుని దారిలో ఆపి దిగమని చెప్పాడు. అప్పుడు ఇద్దరు కారులో నుంచి దిగుతారు. అప్పుడు రిషి వసుధారతో ప్రేమికుల మధ్య దాంపత్య భేదాలు ఉండకూడదు అని అంటారు అది ఎందుకో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు వసు, దాంపత్య భేదాలు అనేవి మబ్బులు లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి కానీ కానీ చివరి వరకు మిగులు అని అంటుంది.
అప్పుడు రిషి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నన్ను రిషి గా ప్రేమించావా? లేక జగతి మేడం కొడుకుగా ప్రేమించావా అని అనగా, నేను ప్రేమించిన వ్యక్తి జగతి మేడం కొడుకు కాదా సార్ అని వసు అంటుంది.నేను నిన్ను ప్రశ్ని అడిగితే నువ్వు తిరిగి నన్ను ఇంకో ప్రశ్న అడుగుతున్న వసుధార అని అనగా మీ ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది సార్, కానీ మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు.అసలు ఏం జరిగిందంటే అని చెప్పేలోగే రిషి వసుని ఆపి ,అక్కడ ఏం జరిగిందో నాకు తెలిసింది కదా వసుధారా ఇంకా ఆ విషయం గురించి వదిలేయ్. గురుదక్షిణ ఒప్పందం నీకు నా డాడీకి మధ్య జరిగింది దానికి నేను నిన్ను ప్రేమించడానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక మనిషిని ప్రేమించడానికి ఒప్పందాలు, షరతులు పెట్టావు అనే బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు అని అంటాడు రిషి. అసలు జరిగిందేంటంటే అని వసు చెప్పేలోగా రిషి, వసుని ఆపి ఇంక నాకేం చెప్పద్దు వసుధార. అయినా నువ్వు డాడ్ తో చేసిన ఒప్పందం నాకేం నచ్చలేదు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!