యాంకర్ రష్మీపై మనసు పారేసుకున్న మెగా మేనల్లుడు.. హాట్ కామెంట్స్ వైరల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మరో పరాజయం ఎదురైంది. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా చిత్రం నిరాశపరిచింది. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి మరో పరాజయం ఎదురైంది. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా చిత్రం నిరాశపరిచింది. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. ఉప్పెనతో లభించిన క్రేజ్ ని ఈ మెగా హీరో సరిగా ఉపయోగించుకోవడం లేదు.. కథల ఎంపికలో తడబడుతున్నాడు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.
తన తదుపరి చిత్రంతో అయినా వైష్ణవ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఇటీవల ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. సిల్వర్ స్క్రీన్ పై గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాలతో బోల్డ్ నటిగా పాపులర్ ఐంది. అయితే రష్మీకి ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్స్ రావడం లేదు.
వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ ఆసక్తికర ప్రశ్న అడిగింది. మీ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే.. అందులో ఏ బ్యూటీతో పెర్ఫామ్ చేయాలనుకుంటారు అని ప్రశ్నించింది. దీనికి వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ అని బదులిచ్చాడు.
యాంకర్ రష్మీ హాట్ హాట్ గా హావభావాలు పలికించే విధానం చాలా బావుంటుందని వైష్ణవ్ తెలిపాడు. ఐటెం సాంగ్ లో ఆమె పెర్ఫామ్ చేస్తే అదిరిపోతుంది అని అన్నాడు. రష్మీపై వైష్ణవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. వైష్ణవ్ మాత్రం యాంకర్ రష్మీని కోరుకుంటున్నాడు.
అయితే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. దీనితో ఈ చిన్న మెగా మేనల్లుడు కెరీర్ లో ఆచి తూచి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది.