కూతురి కోసం కెరీర్ ను త్యాగం చేసిన కృతి శెట్టి తల్లి, లక్షల్లో సంపాదన వదిలేసుకుందట..?
మొదటి సినిమాతో స్టార్ ఇమేజ్ సాధించింది కృతి శెట్టి. వరుస హిట్లతో దూసుకుపోతోంది బ్యూటీ. అయితే చాలా సులువుగా హీరోయిన్ అయిపోయింది అనుకుంటున్న కృతి శెట్టి కెరీర్ వెనుక ఆమె తల్లి త్యాగం ఉందట. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..?
ఉప్పెన సినిమాతో సెన్సేషన్ అయ్యింది కృతి శెట్టి. ఆతరువాత వరుస ఆఫర్లు ఆమెను వరిస్తూ వచ్చాయి. మొదట కాస్త పద్దతిగా కనిపించి కృతి శెట్టి.. స్పైసీ కంటెంట్ కు కూడా సై అనడంతో స్టార్ హీరోలు కూడా ఆమెను ఆప్షన్ గా తీసుకుంటున్నారు.
కృతి శెట్టి చాలా ఈజీగా హీరోయిన్ అయిపోయింది అని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వినిపించాయి. అయితే హీరోయిన్ అవ్వడానికి చాలా కష్టపడిందట కృతి. అంతే కాదు ఆమె హీరోయిన్ అవ్వడం కోసం ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసిందట. ముఖ్యంగా కృతి శెట్టి మదర్ తన లైఫ్ నే త్యాగం చేసిందట.
హిందీలో సూపర్ 30 లో స్టూడెంట్ గా మొదటి సారి తేరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఆ సినిమా తరువాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది బేబమ్మ. ఉప్పెన తరువాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టింది బ్యూటీ.
2003 సంవత్సరంలో ముంబైలో పుట్టిన శెట్టి తులు ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి. కర్ణాటకలోని మంగళూరు వారి నెగెటీవ్ ప్లేస్.. అయితే ఆమె తండ్రి వ్యాపార రిత్యా ముంబైకి వచ్చే సెటిల్ అయ్యాడు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ కృతికి ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు.
ముంబైలో పెరిగిన కృతి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వరుసగా అవకాశాలు రావడంతో కృతి శెట్టి తన తల్లి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్న జాబు ని కూడా వదిలేసిందట. లక్షల్లో సంపాదనను తన కూతురికోసం వదులుకుందట కృతి అమ్మగారు. ఇక కృతి ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు తల్లిని కూడా తీసుకెళ్తుంది. తన తల్లి కెరియర్ సైతం కోల్పోయి తనను హీరోయిన్ గా చేసిందంటూ ఇటీవల ఫంక్షన్ లో కృతి చెట్టి వెల్లడించింది.
krithi shetty
చాలామంది కృతి తల్లి చేసిన పనికి శభాష్ అంటున్నారు. అది కూడా వరుస సినిమాల్లో కనిపించిన కృతి శెట్టి ప్రస్తుతం మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.అంతే కాదు తన ఖాతాలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. కొన్ని సినిమాలు పెండింగ్ లో పెట్టిందట బ్యూటీ.