చిరంజీవి తనయ సుస్మితపై ట్రోల్స్.. కాస్ట్యూమ్ డిజైనర్గా తీసేయాలంటూ రచ్చ.. మెగాడాటర్పై ఇవి ఊహించలేం!
ఇటీవల చిరంజీవి ప్రతి సినిమాకి ఆయన కూతురు సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తుంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆమె ట్రోలర్స్ బారిన పడింది.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా.. ప్రస్తుతం తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహిస్తున్నారు. ఇటీవల ప్రతి చిరంజీవి మూవీకి ఆమెనే కాస్ట్యూమ్స్ చేస్తుంది. మెగాస్టార్ని యంగ్గా చూపించడంలో ఆమె వంతు ప్రయత్నం చేస్తుంది. అందుకోసం శ్రమిస్తుంది.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
తన కూతురు సుస్మిత వర్క్ పట్ల చిరంజీవి కూడా చాలా సార్లు ప్రశంసలు కురిపించారు. తనని బాగా చూపించేందుకు కష్టపడుతుందని తెలిపారు. రాను రాను మరింతగా యంగ్గా చూపిస్తుందని తెలిపారు. తన కూతురు పనితీరుపట్ల ఆయన మురిసిపోయాడు. కానీ అభిమానుల్లో మాత్రం విభిన్నమైన అభిప్రాయం ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టారు.
చిరంజీవి లుక్స్ బాగా ఉండటం లేదంటున్నారు. కారణం సుస్మితనే అంటున్నారు. అన్ని సినిమాలకు రెగ్యూలర్గా చూపిస్తుందని అంటున్నారు. నెపోటిజం ఉంటే ఇలానే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి లుక్స్ లో మార్పు ఉండటం లేదని, బాగా ఉండటం లేదంటున్నారు. ట్రోలర్స్ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.
సుస్మిత కొణిదెల తాజాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. సినిమా గురించి, కాస్ట్యూమ్స్ విభాగం గురించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నెటిజన్లు రియాక్ట్ అవుతూ రచ్చ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవికి స్టయిలీష్ చేయోద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆమెని మార్చాలని అంటున్నారు. చిరంజీవికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అంటున్నారు.
మరోవైపు అక్కడ(తమిళం)లో రజనీ కూతుళ్లు, ఇక్కడ చిరంజీవి కూతుళ్లు, వారికి దూరంగా ఉండాలంటున్నారు. దీంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. రజనీకాంత్కి కూతుళ్లతో పనిచేసిన ఏ సినిమా ఆడలేదు. ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక్కడ చిరంజీవి విషయంలోనూ అదే జరుగుతుందంటున్నారు నెటిజన్లు.
ఇక సుస్మితని నిర్మాతని చేయాలనుకుంటున్నాడు చిరంజీవి. ఆ మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ కూడా జరిగింది. కళ్యాణ్ కృష్ణతో సినిమా అనుకున్నారు. కానీ అది ఆదిలోనే ఆగిపోయింది. మళ్లీ ఆ ప్రయత్నాలు సాగుతున్నాయట. మరి ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి. కానీ ఒకవేళ సినిమా తీస్తే, అది ఫ్లాప్ అయితే కారణం ఆమెనే అంటారేమో.
చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్. మర ఐదుగురుభామలు ఇందులో చిరుకి చెల్లెళ్లుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.