చిలిపి పోజులు.. చిరు నవ్వుతో కలవరపెడుతున్న త్రిష.. ఆ మత్తు చూపులకు మతిపోకుండా ఉంటుందా!
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ (Trisha Krishnan) గ్లామర్ మెరుపుతో నెట్టింట దుమారం రేపుతోంది. క్రేజీ ఫొటోషూట్లతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. లేటెస్ట్ గా త్రిష పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
తెలుగు ప్రేక్షకులకు తమిళ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ను కొన్నేండ్ల పాటు ఊపూపిన హీరోయిన్లలో త్రిష ఒకరు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలయ్య, వెంకటేశ్ లాంటి బడా హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది.
సినీ ఇండస్ట్రీలో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్ గానే రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తైనా నేటికీ దూకుడుగానే వ్యవహరిస్తోంది.
1999 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న త్రిష.. లాక్ డౌన్ తర్వాత సినిమాల జోరును కాస్తా తగ్గించింది. ప్రస్తుతం మళ్లీ జోరు పెంచుతోంది. ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan : 1) తో సాలిడ్ హిట్ ను అందుకుని మళ్లీ రైజ్ అయ్యింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన తమిళ చిత్రం ‘రాంగీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ లో ఎం సరవన్ దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. డిసెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది.
ప్రచార కార్యక్రమాల్లో త్రిష కూడా జోష్ గా పాల్గొంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. మరోవైపు క్రేజీ అవుట్ ఫిట్స్ లో వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కుర్రాళ్ల కళల రాణిగా ఊపూపిన త్రిష.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోస్ లో స్లీవ్ లెస్ కలర్ ఫుల్ గౌన్ లో అందాలను ఆరబోసింది. చిలిపి పోజులతో.. చిరు నవ్వులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. చాలా కాలం తర్వాత త్రిష నెట్టింట సందడి చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.