- Home
- Entertainment
- అఫీషియల్: సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా
అఫీషియల్: సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా
స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ
గత కొన్ని రోజులుగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందబోయే స్పిరిట్ చిత్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఈ మూవీ నుంచి బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె తప్పుకోవడమే అందుకు కారణం. దీపికా ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో హీరోయిన్ విషయంలో రూమర్స్ మొదలయ్యాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్ కి చెక్ పెట్టి స్పిరిట్ మూవీలో నటించే హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు.
అఫీషియల్
స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్కు జోడీగా త్రిప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.వంగా తన అధికారిక ఖాతాలో, “నా తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే నటి ఇక అధికారికం '' అంటూ సందీప్ రెడ్డి త్రిప్తి డిమ్రీ పేరు ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా త్రిప్తి డిమ్రీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆమెకి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
దీపికాతో విభేదాలు
ఈ పాత్రకు తొలుత దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఆమెకు దర్శకుడితో పారితోషికం, ఇతర కండిషన్స్ కి సంబంధించిన విషయాల్లో విభేదాలు తలెత్తాయి. దీనితో దీపికా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రుక్మిణి వసంత్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. చివరికి త్రిప్తి డిమ్రీనే ఫైనల్ చేశారు.
త్రిప్తి డిమ్రీకి గోల్డెన్ ఛాన్స్
త్రిప్తి డిమ్రీ గతంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘యానిమల్’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ చిత్రంలో ఆమె పాత్ర చిన్నదే అయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘స్పిరిట్’ చిత్రంలో ఆమె ప్రధాన కథానాయికగా ఎంపిక కావడం త్రిప్తి డిమ్రీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
భారీ అంచనాలు
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘స్పిరిట్’ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతుందనే భావన అభిమానుల్లో నెలకొంది. సందీప్ రెడ్డి వంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ డైరెక్టర్ ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.