సంచలన నిర్ణయం తీసుకున్న టాప్ యాంకర్స్ సుమ, అనసూయ!
కరోనా మహమ్మారి రోజు రోజు విజృంభిస్తోంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటొంది. దీంతో సినీ, టెలివిజన్ రంగాల్లో పనిచేస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ రంగాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి షూటింగ్లు ఆపేసే దిశగా ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
తాజాగా అమితాబ్ బచ్చన్కు కరోనా సోకటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్లో పాల్గొన్న సమయంలోనే అమితాబ్కు కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో షూటింగ్లు చేయాలంటే యాంకర్లు, నటీ నటులు వణికిపోయే పరిస్థితి వచ్చింది.
అమితాబ్కు కరోనా రావటంతో ఆయన నుంచి ఆయన కొడుకు అభిషేక్కు.. అభిషేక్ నుంచి ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా సోకటంంతో తెలుగు టెలివిజన్ రంగంలో పనిచేసేవారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. తమ కారణంగా తమ కుటుంబాలకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందన్న భయం టాలీవుడ్ యాంకర్లలోనూ కనిపిస్తోంది.
దీంతో స్టార్ యాంకర్లు షూటింగ్లకు బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సుమ, అనసూయ లాంటి టాప్ యాంకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు టీవీ సీరియల్స్ నటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో షూటింగ్ లకు మరోసారి బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట.
షూటింగ్ నిమిత్తం చాలా మందితో కలవాల్సి ఉంటుంది. మేకప్, కాస్ట్యూమ్స్ లాంటివి వాటి విషయంలో ఇతరుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైరస్ సోకే అవకాశం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కొంత కాలం షూటింగ్లకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారట స్టార్ యాంక్టర్లు.
ముఖ్యంగా అనసూయ, సుమలు తమ ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం షూటింగ్లకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.