- Home
- Entertainment
- Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు
Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు
టాలీవుడ్ లో అగ్ర హీరోల కుమార్తెలు వివిధ రంగాలలో బిజీగా ఉన్నారు. కొందరు ఇండస్ట్రీలో సెటిల్ అయితే మరికొందరు కుటుంబ బాధ్యతలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో అగ్ర హీరోల కుమార్తెలలో ఎవరు అత్యంత ధనవంతులు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరోల కుమార్తెలు
టాలీవుడ్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలో ఎక్కువగా రాణిస్తున్నారు. అయితే అగ్ర హీరోల కుమార్తెలు అందరూ ఇండస్ట్రీలో లేరు. కొంత మంది ఉన్నప్పటికీ నటీమణులుగా రాణిస్తున్నది మాత్రం కొందరే. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు కుమార్తెలు ఉన్నారు. అగ్ర హీరోల కుమార్తెలలో ఎవరు రిచెస్ట్ చర్చ జరుగుతోంది.
వ్యాపారాల్లో బ్రాహ్మణి, ఇండస్ట్రీలో సుష్మిత
చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా రాణిస్తున్నారు. మొన్ననే మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి.. తన మామగారు సీఎం చంద్రబాబు, భర్త నారా లోకేష్ కి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కి ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. బ్రాహ్మణి పేరుపై హెరిటేజ్ ఫుడ్స్ లో భారీగా షేర్స్ ఉన్నాయి. 2024 ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ ఎన్నికల అఫిడవిట్ లో తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల విలువ 500 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.
వీళ్ళని మించే ధనవంతురాలు
ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నెట్ వర్త్ 100 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచానా ఉంది. అంత మాత్రాన సుష్మిత, నారా బ్రాహ్మణి స్టార్ హీరోల కుమార్తెలలో అత్యంత ధనవంతులు ఏమీ కాదు. మరో స్టార్ హీరో కుమార్తె కూడా ఉన్నారు. ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కుమార్తెలు సరితూగరు అనే చెప్పాలి.
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి
వీళ్ళ ఆస్తులు వందల కోట్లల్లో ఉంటే ఆమె ఆస్తి మాత్రం వేల కోట్లల్లో ఉంటుంది. ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి ఘట్టమనేని. ఆమె మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ సతీమణి. అమర్ రాజా గ్రూప్ సంస్థ వీళ్ళ కుటుంబానికి చెందిందే. గతంలో గల్లా జయదేవ్ తన ఆస్తుల విలువ 700 కోట్లుగా ప్రకటించారు. అయితే అమర్ రాజా గ్రూప్ సంస్థ విలువ 25 వేల కోట్ల పైనే ఉంటుంది అని అంచనా.
వేలకోట్ల ఆస్తి
ఈ కంపెనీలో గల్లా ఫ్యామిలీ షేర్ల విలువ 8000 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో మెజారిటీ వాటా పద్మావతి ఘట్టమనేనిదే అనే ప్రచారం ఉంది. ఈ లెక్కన చూస్తే ఆమె వేల కోట్లకు అధిపతి. కానీ పద్మావతి ఎప్పుడూ మీడియా ముందు కనిపించడం, మీటింగ్స్ లో హడావిడి చేయడం ఉండదు.

