ఎందుకు తీసేశారో 'ఢీ' వాళ్లనే అడగండి... మీడియా ప్రశ్నకు రష్మీ దూకుడు సమాధానం!
బుల్లితెర ప్రేక్షకుల అత్యంత ఆదరణ చూరగొన్న రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ఏళ్లుగా ఈ షో ఈటీవిలో ప్రసారం అవుతుండగా అత్యధిక టీఆర్పీతో తిరుగులేదని నిరూపించుకుంది. సీజన్స్ వారీగా అనేక మార్పులు చేసుకుంటూ క్రేజ్ మరింత పెంచుకుంటుంది.
కొన్ని సీజన్స్ నుండి కామెడీ అండ్ రొమాన్స్ ఈ షోకి కలిపారు. సుధీర్ అండ్ ప్రదీప్ కామెడీ అనేది స్టేజ్ పై హైలెట్ అవుతూ ఉండేది. అలాగే సుధీర్, రష్మీల రొమాన్స్ మరోఎత్తు. ఈ కాన్సెప్ట్ వర్క్ అవుట్ కావడంతో మరింతగా పెంచారు. వర్షిణి అనే మరో యాంకర్ ని తీసుకోవడం జరిగింది.
నీలి చీరలో జలకన్యలా వర్షిణి పోజులు హాట్ టాపిక్ గా మారాయి. లూస్ హెయిర్, హియర్ ఐటమ్స్ వర్షిణి అందాన్ని మరింతగా పెంచేశాయి. వర్షిణి ఫోటోలను చూసిన ఫ్యాన్స్ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు.
తరువాత జబర్ధస్త్ ఆదిని షోలోకి ఎంటర్ చేశారు. వర్షిణి, ఆదిను జంటగా సెట్ చేసి రొమాన్స్ పండించారు. ఢీ వేదిక ద్వారా వర్షిణి కొంత ఫేమ్ సంపాదించారు.ఏమైందో తెలియదు లేటెస్ట్ సీజన్ నుండి వర్షిణి కనిపించడం లేదు.
ఒకటి రెండు ఎపిసోడ్స్ వరకు కూడా ఆమె వస్తుందని ఆశపడిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. ఫైనల్ గా ఢీ షో నుండి వర్షిణి తప్పుకున్నారని అర్థం అయ్యింది.
ఆమె స్థానంలో దీపిక పిల్లి వచ్చి చేరారు. దీనితో వర్షిణిని తీసేశారా లేక ఆమెనే తప్పుకున్నారా అనే సందేహం అందరిలో మొదలైంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మీని మీడియా అడుగగా ఆమె కొంచెం ఆసక్తికరంగా స్పందించారు.
వర్షిణి ఢీ షోలో ఎందుకు కన్పించడం లేదన్న ప్రశ్నకు రష్మీ.. ఆ విషయం నాకెలా తెలుస్తుంది, ఢీ నిర్వాహకులు లేదా మల్లెమాల వాళ్లకు తెలుస్తుంది అన్నారు.
పరోక్షంగా వర్షిణి ఏ కారణంగా రావడం లేదో నాకు తెలియదు అన్నారు. నిజానికి దీని వెనుక కారణం రష్మీకి ఎందుకు తెలియకుండా ఉంటుంది చెప్పండి.. ఆమె కావాలని తప్పుకోవడం కాకపోతే!