- Home
- Entertainment
- Savitri Life Story: సావిత్రి సామ్రాజ్యం కూలిపోతుంటే జెమినీ గణేశన్ ఏం చేశారు? తెర వెనుక కన్నీటి కథ!
Savitri Life Story: సావిత్రి సామ్రాజ్యం కూలిపోతుంటే జెమినీ గణేశన్ ఏం చేశారు? తెర వెనుక కన్నీటి కథ!
మహానటి సావిత్రి జీవితంలోని విషాద ఘట్టాలను ఈ కథనం వివరిస్తుంది. ఆమె పతనం అంచున ఉన్నప్పుడు 'కాదల్ మన్నన్' జెమినీ గణేశన్ ఏం చేశారు? వారి బంధంలోని చిక్కుముడులు, సావిత్రి దాన గుణం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మహానటి సావిత్రి
జెమినీ గణేశన్, సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ
మొదట్లో జెమినీ గణేశన్, సావిత్రి మధ్య చిగురించిన ప్రేమ ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. అప్పటికే పెళ్లై, పిల్లలున్న జెమినీ ఇంటికి ఓ మిడ్ నైట్ వర్షంలో తలదాచుకోవడానికి సావిత్రి వచ్చారట. అప్పుడు ఆమెకు ఆశ్రయమిచ్చిన జెమినీ గణేశన్, ఆ తర్వాత తాళి కట్టారు. కానీ, ఈ ప్రేమ తర్వాత తీవ్రమైన 'పొసెసివ్నెస్'గా మారింది. 'నువ్వు మొదటి భార్య ఇంటికి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుంటా' అని సావిత్రి బెదిరించడంతో, జెమినీ 'రెండు జీవితాలు' గడపాల్సి వచ్చింది. పగలు ఒక ఇల్లు, రాత్రి సావిత్రి ఇల్లు అంటూ ఆ కాదల్ మన్నన్ సతమతమయ్యారని సినీ వర్గాలే కాదు, జెమినీ బంధువులు కూడా చెబుతారు.
జెమినీ-సావిత్రి మధ్య వచ్చిన మనస్పర్థలు
సావిత్రి 19 నెలల పాటు కోమాలో
ఇంట్లో పేదరికం ఉన్నా..
సంపద కరిగిపోయి, పేదరికంలో చిక్కుకున్నా 'నటియర్ తిలగం' సావిత్రి తన దాన గుణాన్ని మాత్రం వదులుకోలేదు. యుద్ధ నిధి కోసం తాను స్టేజీపైనే ఒంటిపై ఉన్న నగలన్నీ విప్పి ఇచ్చేసిన ఆ ఉదారత, మరే నటికీ సాధ్యం కానిది. ఇంట్లో పేదరికం ఉన్నా, తనను వెతుక్కుంటూ వచ్చి 'ఆకలి' అన్నవారికి, ఇంట్లో ఉన్న ఖరీదైన పాత్రలు ఇచ్చైనా వారి ఆకలి తీర్చారు.

