అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చిరంజీవి.. ఆ దర్శకుడు చెప్పిందే నిజమైందట!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ని ఏలేస్తాడని ఆ దర్శకుడికి ముందే తెలుసా? దాదాపు నలభై ఏళ్ల క్రితమే చిరంజీవి కాబోయే టాలీవుడ్ గాడ్ ఫాదర్ అని ఆ దర్శకుడు ముందే చెప్పాడా?.. అవునట..ఆ దర్శకుడు చెప్పిన జోస్యం నిజమైందట.
చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్. ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగు చిత్రపరిశ్రమని ఏలారు. ఇప్పుడు చిరంజీవి ఏలుతున్నారు. కొత్తగా ఎంత మంది యంగ్ హీరోలు వస్తున్నా.. ఆయన స్థానం అగ్ర భాగమే. టాలీవుడ్ టాప్ చైర్ ఆయనదే. (చిరంజీవి అరుదైన ఫోటో)
పాన్ ఇండియా సినిమాలతో యంగ్ హీరోలు దూకుడు చూపిస్తున్నారు. ప్రభాస్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్, రామ్చరణ్ ఇలా యంగ్ హీరోలు తమ యంగర్ సెక్షన్లో టాప్ ఛైర్ కోసం పోటీపడుతున్నారు. కానీ తెలుగు సినిమాకి మాత్రం ఇప్పుడు ఎవరి బిగ్ స్టార్ అంటే చిరంజీవి వైపే అందరి వేలు వెళ్తుంది. (చిరంజీవి అరుదైన ఫోటో)
లభై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఏకఛత్రాధిపత్యంగా టాలీవుడ్ని శాషించారు. ఓ వైపు ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబులు ఉన్నా, టాప్ స్టార్ ఎవరంటే ఎన్టీఆర్నే చూసేవాళ్లు. ఇప్పుడు అలాగే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలున్నా, టాలీవుడ్ అంటే చిరంజీవినే చూస్తారు. అంతగా తన అద్భుతమైన నటనతో, మాస్ ఫాలోయింగ్తో టాలీవుడ్ టాప్ స్టార్గా ఎదిగారు. టాప్ ఛైర్ని తన వశం చేసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చినా, చిరు స్థానం ఇప్పటికీ పదిలం. మరో పదేళ్ల వరకు ఆ ఛైర్ని టచ్ చేసే వాళ్లే లేరని చెబితే అతిశయోక్తి కాదు. (చిరంజీవి అరుదైన ఫోటో)
అయితే చిరంజీవి.. కాబోయే మెగాస్టార్ అని, ఎన్టీఆర్ రేంజ్లో ఎదుగుతారని 40ఏళ్ల క్రితం ఓ దర్శకుడు చెప్పారట. ఆయన ఎవరో కాదు `బిల్లా రంగా` చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్.ఆర్. దాస్. చిరంజీవి, మోహన్బాబు కాంబినేషన్లో ఈ సినిమాని ఆయన రూపొందించారు. ఆ సమయంలో చిరు డ్రెస్ మార్చుకుంటుండగా, వీపుపై పెద్ద పుట్టుమచ్చని చూశారట. (చిరంజీవి అరుదైన ఫోటో)
అప్పుడాయన.. ఎన్టీఆర్ మాదిరిగానే మీకు కూడా మచ్చ ఉంది. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయనలా నువ్వు పాపులారిటీ సంపాదించుకుంటావని చెప్పారట. అప్పుడు చిరంజీవి కేవలం అప్కమింగ్, ప్రామిసింగ్ హీరో మాత్రమే. చాలా మందికి ఆయన సరిగా కూడా తెలియదు. ఇప్పుడు ఆయన మెగాస్టార్గా ఎదిగారు. ఈ లెక్కన డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ జోస్యం నిజమై చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారని చెప్పొచ్చు. (చిరంజీవి అరుదైన ఫోటో)
రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన చిరంజీవి 9ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి `ఖైదీ నెం.150`తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని నిరూపించుకున్నారు. `సైరా`తో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.