- Home
- Entertainment
- దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
దళపతి విజయ్ 'జననాయగన్' సినిమా ఆన్లైన్లో అక్రమంగా లీక్ కావడంతో సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొంత మందిని అరెస్ట్ చేసినట్టు తెలస్తోంది.
15

Image Credit : KVN Productions
జననాయగన్ లీక్ కేసు..
'జననాయగన్' సినిమాను ఆన్లైన్లో లీక్ చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీనిపై తమిళనాడు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 'జననాయగన్' సినిమా పైరసీపై వచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ విభాగం వెంటనే రంగంలోకి దిగింది. స్టేట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లో క్రైమ్ నెం. 47/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం, సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

25
Image Credit : ANI
ఆరుగురు నిందితుల అరెస్ట్
ఫిర్యాదు అందగానే సైబర్ క్రైమ్ విభాగంలో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పైరసీ లింకులను గుర్తించి బ్లాక్ చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, నిందితులను పట్టుకోవడం వంటి పనులను ఈ టీమ్స్ చేపట్టాయి. డిజిటల్ ఆధారాల విశ్లేషణ తర్వాత, క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ల ద్వారా సినిమాను అప్లోడ్ చేసి, డ్రైవ్ లింకులను పంచుకున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
35
Image Credit : our own
ఇంటర్నెట్లో నిరంతరం నిఘా
పైరసీ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇంటర్నెట్లో నిరంతరం నిఘా కొనసాగుతోంది. ఇప్పటివరకు, సుమారు 300 పైరసీ లింకులను బ్లాక్ చేయాలని రిక్వెస్ట్లు పంపారు. మరిన్ని లింకులను గుర్తించి, తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఈ నేరంలో పాలుపంచుకున్న ఇతరులను గుర్తించే పని కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
45
Image Credit : Asianet News
ప్రజలకు పోలీసుల సూచన
'జననాయగన్' లేదా ఇతర కాపీరైట్ ఉన్న కంటెంట్ పైరసీ కాపీలను డౌన్లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా షేర్ చేయవద్దని ప్రజలకు పోలీసులు గట్టిగా సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం అరెస్ట్కు దారితీసే నేరం. దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లు లేదా వెబ్సైట్ల ద్వారా తెలిసి తెలిసి పైరసీ కంటెంట్ను ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు ఉంటాయి.
55
Image Credit : our own
ఎలా కంప్లైయింట్ చేయాలి:
మీకు ఇలాంటి పైరసీ లింకులు కనిపించినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు ఏవైనా గమనించినా, వెంటనే సైబర్ క్రైమ్ టోల్-ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.
Latest Videos

