- Home
- Entertainment
- Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు.. కమల్కి పైడి జయరాజ్ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్ అవార్డు
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు.. కమల్కి పైడి జయరాజ్ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్ అవార్డు
మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, ఆర్ నారాయణమూర్తి, సుద్ధాల అశోక్ తేజకి గద్దర్ అవార్డులు వరించాయి. స్పెషల్ జ్యూరీ కింద వీరికి ప్రత్యేకంగా ప్రముఖుల పేర్లతో నెలకొల్పిన గద్దర్ అవార్డులకు ఎంపిక చేశారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025
గద్దర్ అవార్డుల ప్రకటన వచ్చింది. 2025 ఏడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మెన్ దిల్ రాజు. ఇందులో చిరంజీవి, కమల్ హాసన్, జయసుధ, ఆర్ నారాయణమూర్తి, అశ్వినీదత్, రమేష్ ప్రసాద్, సుద్ధాల అశోక్ తేజలకు ప్రత్యేక అవార్డులు వరించాయి. ఎన్టీఆర్ అవార్డుకి చిరంజీవిని ఎంపిక చేవారు. అలగే పైడి జయరాజ్ అవార్డుకి కమల్ హాసన్ని ఎంపిక చేశారు. అక్కినేని అవార్డుకి జయసుధని ఎంపిక చేయడ విశేషం.
గద్దర్ అవార్డులను ప్రకటించిన దిల్ రాజు
ఇక నాగిరెడ్డి చక్రపాణి అవార్డు నిర్మాత అశ్వనీదత్కి వరించగా, సినారె అవార్డు సుద్ధాల అశోక్ తేజకి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్కి, కాంతారావు అవార్డుకి ఆర్ నారాయణమూర్తిని ఎంపిక చేశారు. బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుకి సింగీతం శ్రీనివాసరావుని ఎంపిక చేయడం విశేషం. తెలుగు సినిమా అభివృద్ధికి దోహదపడ్డ మన సినీ దిగ్గజాల పేరుతో అవార్డులను ప్రకటించారు. ఈ సారి కొత్తగా వీటిని ప్రకటించారు.
మార్చి 19న గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
గతేడాది విడుదలైన అవార్డులకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి ఛైర్మెన్గా ఎంపికైన జ్యూరీ కమిటీ ఈ అవార్డులను నిర్ణయించింది. మార్చి 19న ఈ గద్దర్ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

