- Home
- Entertainment
- Rajasekhar: రంభ, సౌందర్య హీరోయిన్లు.. రాజశేఖర్ అలాంటోడని తెలిసి కూడా సినిమా చేశా, కెరీర్ నాశనం చేసుకున్నా
Rajasekhar: రంభ, సౌందర్య హీరోయిన్లు.. రాజశేఖర్ అలాంటోడని తెలిసి కూడా సినిమా చేశా, కెరీర్ నాశనం చేసుకున్నా
రంభ, సౌందర్య హీరోయిన్లుగా రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఓ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ సినిమా గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో వివరించారు.

Rajasekhar
రాజశేఖర్ యాంగ్రీ హీరోగా టాలీవుడ్ లో చాలా కాలం వెలుగు వెలిగారు. యాక్షన్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, సందేశాత్మక సినిమాలతో రాజశేఖర్ ప్రేక్షకులని అలరించారు. ఇప్పుడు రాజశేఖర్ హవా టాలీవుడ్ లో తగ్గిపోయింది. చివరగా రాజశేఖర్ గరుడ వేగా సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు.
శ్రీకాంత్ హీరో కానీ..
రాజశేఖర్ కెరీర్ లో రాణిస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. దీని గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాజీగర్ అనే హిందీ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. హీరోగా శ్రీకాంత్ ఫిక్స్ అయ్యాడట. కానీ ఇంతలో రాజశేఖర్, జీవిత నాకు ఫోన్లు చేయసి రిక్వస్ట్ చేయడం ప్రారంభించారు.
నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే
ఎలాగైనా చేసి ఆ మూవీలో ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. రాజశేఖర్ నన్ను రిక్వస్ట్ చేసినా అతడిని అవాయిడ్ చేసే ఆప్షన్ నాకు ఉంది. రాజశేఖర్ ని రిజెక్ట్ చేయకపోవడమే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. అప్పటికి రాజశేఖర్ చాలా సినిమాలు చేసి ఉన్నాడు. అతడి బిహేవియర్, యాటిట్యూడ్ గురించి ఇండస్ట్రీలో చాలా చర్చ నడుస్తోంది. అది తెలిసి కూడా రాజశేఖర్ కి అవకాశం ఇవ్వడం నేను చేసిన బ్లండర్ మిస్టేక్.
రాజశేఖర్ ఎలా బిహేవ్ చేసేవాడు అంటే..
రాజశేఖర్ తో ఆ సినిమా చేయడం వల్ల కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా నాశనం అయ్యాను. చాలా కాలం పాటు కోలుకోలేకపోయా. అంత దారుణంగా ఆ సినిమా నన్ను దెబ్బకొట్టింది. అసలేం జరిగింది అని ప్రశ్నించగా.. రాజశేఖర్ షూటింగ్స్ కి సరిగ్గా రాడు. దీనితో కాంబినేషన్స్ దెబ్బతిన్నాయి. ఆలస్యం అయింది. బడ్జెట్ పెరిగిపోయింది.
అందుకే ఫ్లాప్
అసలు సినిమాపై అందరికీ ఆసక్తి పోయింది. బాజీగర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం పేరు వేటగాడు. సౌందర్య, రంభ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లోనే ఆ చిత్రానికి 2 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చయింది అని చాలా నష్టపోయాను అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

