మూడు రోజుల ముందే అన్ని అప్పులు తీర్చేసిన సుశాంత్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నుంచి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినీ పరిశ్రమ కోలుకుంటుంది. సుశాంత్ మరణం మీద అనుమానాలు వ్యక్తమవ్వటంతో పోలీసు విచారణ జరుగుతుంది. ఈ సందర్బం పలు సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి.
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతితో పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. కొంత మంది సినీ పెద్దలు సుశాంత్ను వేదించిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తుండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
సుశాంత్ మృతిపై విచారణ ప్రారంభించిన ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అవకాశాలు లేకపోవటం, ఆర్ధిక సమస్యల కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సుశాంత్ డిప్రెషన్లో ఉన్నాడన్న విషయం మీద కూడా పోలీసులు దృష్టిసారించారు.
వార్త సంస్థ మిడ్ డే సమాచారం ప్రకారం.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన ఇంటి పనివారికి, మేనేజర్కు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించినట్టుగా తెలుస్తోంది. డబ్బు చెల్లించే సమయంలో ఆర్ధిక సమస్యల కారణంగా మిమ్మల్ని కొనసాగిచలేనని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే పనివారు మాత్రం `అలా ఏం లేదు.. మీరు ఎప్పుడు మాకు సాయంగా ఉన్నారు. కష్టకాలంలో మేం మీతో ఉంటాం` అని చెప్పినట్టుగా మిడ్ డే పేర్కొంది.
మరో పనిమనిషి మాట్లాడుతూ తాను తన కలలను నేర్చుకోలేనేమో అని బాధపడినట్టుగా తెలిపాడు. పిల్లలను నాసాకు పంపాలని సుశాంత్ కోరిక అని ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సమస్యల కారణంగా సుశాంత్ ఆ కోరిక తీరదని బాధపడినట్టుగా తెలుస్తోంది.
సుశాంత్ మేనేజర్ మాట్లాడుతూ.. మరణించడానికి మూడు రోజులు ముందు సుశాంత్ తనకు రావాల్సిన మొత్తన్ని క్లియర్ చేశాడని మేనేజర్ వెల్లడించినట్టుగా మిడ్ డే పేర్కొంది. వరుసగా అవకాశాలు కోల్పోయిన కారణంగానే సుశాంత్ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టుగా మిడ్ డే సంస్థ పేర్కోంది.
అయితే తన మాజీ మేనేజర్ దిశ సలాని ద్వారా 14 కోట్లకు ఓ వెబ్ సిరీస్ కాంట్రక్ట్ చర్చల్లో ఉందని, కానీ జూన్ 8న దిశ మరణంతో ఆ ప్రాజెక్ట్ కూడా చేజారినట్టే అని భావించిన సుశాంత్ డిప్రెషన్కు గురై ఉండటాడని భావిస్తున్నారు. అయితే చాలా కారణాలు కనిపిస్తున్నా అవేవి ఆత్మహత్య చేసుకునే స్థాయిలో లేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.