సుమ కనకాల కొత్త అవతారం.. ఇది జరిగితే యాంకర్ గా గుడ్ బై ?
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. క్రేజీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సుమ యాంకరింగ్ చేస్తే ఆ కిక్కే వేరు. చాలా మంది హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ సెంటిమెంట్ గా మారారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. క్రేజీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సుమ యాంకరింగ్ చేస్తే ఆ కిక్కే వేరు. చాలా మంది హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ సెంటిమెంట్ గా మారారు. సందర్భానుసారం సెటైర్లు వేస్తూ, నవ్వుస్తూ చాలా హుషారుగా సుమ యాంకరింగ్ చేస్తారు. సుమ యాంకరింగ్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు అనే అభిప్రాయం ఉంది.
టాలీవుడ్ లో యాంకర్లు యాంకర్లుగానే ఉండిపోరు. నటనలో కూడా రాణించాలని అనుకుంటారు. చాలా మంది యాంకర్లు నటనలో కూడా సక్సెస్ అయ్యారు. అనసూయ చూస్తే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి తిరుగులేని క్రేజ్ తీసుకువచ్చాయి. శ్రీముఖి కూడా అప్పుడప్పుడూ నటిస్తోంది. యాంకర్ ప్రదీప్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
శ్యామల, ఝాన్సీ ఇలా చాలా మంది యాంకర్లు నటీమణులుగా రాణించినవారే. అయితే సుమ మాత్రం యాంకరింగ్ వృత్తిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గతంలో సుమ కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అవి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు కావు. రెండేళ్ల క్రితం జయమ్మ పంచాయతీ అంటూ తానే ప్రధాన పాత్రలో నటించింది. జయమ్మ పంచాయతీ తర్వాత సుమ మరో చిత్రానికి సైన్ చేయలేదు.
తాజాగా సుమ ఒక క్రేజీ చిత్రానికి సంతకం చేశారు. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రకి ఒప్పుకున్నారట. ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ చిత్రం లో సుమ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోందట. తన పాత్ర బలంగా ఉండడంతో ఆమె అంగీకరించారు. ఏషియన్ సునీల్ కుమార్తె జాన్వీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రానా దగ్గుబాటి ఈ చిత్రానికి ప్రజెంటర్ అట.
నవనీత్ శ్రీరామ్ అనే డెబ్యూ దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి సందీప్ వంగా అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం కనుక సక్సెస్ అయితే సుమ కనకాలకి మరిన్ని ఆఫర్స్ ఖాయం. దీనితో ఆమె కూడా అనసూయ తరహాలో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు అప్పడే సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది.