బాలయ్య బంగారు కొండ.. మెగా ఫ్యామిలీలా కాదు: శ్రీరెడ్డి
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి శ్రీరెడ్డి. మీటూ ఉద్యమంతో తెర మీదకు వచ్చిన ఈ బ్యూటీ తరువాత రాజకీయ, సామాజిక విషయాలపైన తనదైన స్టైల్లో స్పందిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఈ బ్యూటీ, ఈ సందర్భంగానూ వివాదానికి తెర తీసింది.
నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా కారణంగా అంతా ఒక చోట చేరి వేడుకలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాలయ్య బర్త్ డే ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది.
సినీ ప్రముఖుల, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానుల ట్వీట్లకైతే లెక్కే లేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫేస్ బుక్ పేజ్లో పోస్ట్ పెట్టింది..
ఇండస్ట్రీ సింహ స్వప్న, నటరత్న, తెలుగు ప్రియ, ద గ్రేట్ హ్యామన్ బీయింగ్ ఇన్ సోషల్ సర్వీస్, పద్మ శ్రీ అవసరం లేని వ్యక్తి, మీ నవ్వే ఓ పెద్ద అవార్డ్. లివింగ్ లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ గారూ హ్యాపీ బర్త్ డే టూయూ అంటూ ట్వీట్ చేసింది.
అయితే బాలయ్యకు విషెస్ చెపుతూ మెగా ఫ్యామిలీపై ఫైర్ అయ్యింది. ప్రేమతో చెంపమీద కొడతావ్ తప్పా, మెగా ఫ్యామిలీ లాగా కడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం ఆలోచించే ముద్దుల మామయ్య మా బాలయ్య అంటూ కామెంట్ చేసింది.
టాలీవుడ్ లో ఎన్నో వివాదాలకు కారణమైన శ్రీరెడ్డి, చెన్నై వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంతో రచ్చ చేస్తూనే ఉంది.