`అహింస` రిజల్ట్ పై శ్రీరెడ్డి ఘాటు పోస్ట్.. డైరెక్టర్ తేజ, అభిరామ్ని ఓ రేంజ్లో ఆడుకుందిగా!
శ్రీరెడ్డి.. అంటే ఒకప్పుడు టాలీవుడ్ షేక్ అయ్యింది. కాదు తాను షేక్ చేసింది. కొందరు తనని వాడుకున్నారంటూ వారి పేర్లు బయటపెడుతూ రచ్చ చేసింది. హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలచింది.
టాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్సియల్ బ్యూటీ శ్రీరెడ్డి. ఆఫర్ల కోసం తనని చాలా మంది వాడుకున్నారని ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాదు నిర్మాత సురేష్బాబు చిన్న కొడుకు, `అహింస` హీరో అభిరామ్ తనని దారుణంగా వాడుకున్నాడని, ఆయనతోఉన్న సీక్రెట్ ఫోటోలను బయటపెట్టి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి. దీనికితోడు `మా`లో సభ్యత్వం ఇవ్వడం లేదని ఏకంగా నగ్నంగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద ధర్నా చేసింది.
మరోవైపు పవన్ కళ్యాణ్, వంటి కొందరు హీరోలు, నిర్మాతలు, వంటి వారిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. తనకు సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నాళ్లపాటు వార్తల్లో నిలిచింది. హాట్ సెన్సేషన్గా, వివాదాలకు కేరాఫ్గా నిలిచింది. ఆ సమయంలో దర్శకుడు తేజ ఆమెకి సినిమా ఆఫర్లు ఇస్తానని ప్రకటించారు. కొన్నాళ్లు సోషల్ మీడియాలో హడావుడి చేసిన శ్రీరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. తన యూట్యూబ్ ఛానెల్ని నడిపించుకుంటూ, అడపాదడపా వచ్చిన సినిమాలు చేసుకుంటూ రాణిస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటుంది.
చాలా కాలంగా శ్రీరెడ్డిని అంతా మర్చిపోయారు. తన కామెంట్లేదో తాను చేసుకుంటున్న నేపథ్యంలో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం వార్తల్లో నిలుస్తుంది. అభిరామ్ హీరోగా పరిచయం అవుతూ నటించిన `అహింస` సినిమా శుక్రవారం విడుదలైన నేపథ్యంలో శ్రీరెడ్డి రియాక్షన్ ఏంటనేది ఆసక్తి నెలకొంది. పైగా తనకు ఆఫర్లు ఇస్తానని చెప్పిన దర్శకుడు తేజ దీనికి దర్శకుడు కావడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. `అహింస` రిజల్ట్ పై ఆమె రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా(ఫేస్ బుక్) ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో అంతా బూతు పదాలు వాడుతూ అటు అభిరామ్, ఇటు తేజని ఆడుకుంది. ఇందులో చెబుతూ, మా అభి బావ హింస పెట్టి సావగొట్టాడంటా అని, తేజ గా ఔట్ డేటెడ్ అయిపోయావుగాగానీ కొత్త డైరెక్టర్లా పోజు గొట్టకుండా ఇంటికెళ్లు ఇక అని, హమ్మయ్య మొత్తానికి అభిగాడి పని అపోయింది, అయ్యో ఫాఫమ్ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇందులో ఆమె బూతు పదాలు వాడుతూ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇదిప్పుడు వైరల్గా మారింది.
Ahimsa
అభిరామ్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన `అహింస` చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. జెమినీ కిరణ్ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అటు దర్శకుడిగా తేజ విమర్శలను ఎదుర్కోగా, మరోవైపు అభిరామ్ హీరోగా సెట్ కాలేదని, నటన పరంగా ఏమాత్రం ఈజ్ లేదనే కామెంట్లు వచ్చాయి.
మరోవైపు శ్రీరెడ్డి సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. యూట్యూబ్లో వంటల వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుంది. టాలీవుడ్ వివాదాలకు దూరంగా ఉంటుంది. ఎప్పటిలాగే తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుందీ బోల్డ్