పవిత్ర లోకేష్, నరేష్ పై మండిపడిన శ్రీరెడ్డి, వారివన్నీ అపవిత్ర బంధాలే అంటూ..?
కాంట్రవర్సీ కింగ్.. నటి శ్రీరెట్టి మరో సారి రెచ్చిపోయింది. మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఈసారి సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర లోకేష్ పై మండి పడింది. వారి గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
మీటూ ఉద్యమంతో ఫుల్ ఫేమస్ అయ్యింది శ్రీరెడ్డి. టాలీవుడ్ ను వదిలి కోలీవుడ్ చేరిన ఈ కాంట్రవర్సియల్ స్టార్.. టాలీవుడ్ లో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ఇక ఈసారి శ్రీరెడ్డి స్పందించడానికి మంచి టాపిక్ దొరికింది. అదే ప్రస్తుతం నడుస్తున్న నరేష్, పవిత్ర లోకేష్ హాట్ టాపిక్.
పవిత్ర, నరేష్ కాంట్రావర్సీపై నటి శ్రీరెడ్డి స్పందించింది. పవిత్రా లోకేశ్పై సంచలన ఆరోపణలు చేసింది. . ఆమెకు ఎంతోమందితో రిలేషన్షిప్స్ ఉందని చాలా జీవితాల్లో నిప్పులు పోసిందంటూ శ్రీరెడ్డి ఘాటుగా విమర్షించింది. అంతే కాదు తాను ఎవరికి భయటపడనని.. సైలెంట్ గా ఏదో అనేయడానికి రాలేదంటూ తొడకొట్టింది శ్రీరెడ్డి.
రీసెంట్ గా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్పై తీవ్ర ఆరోపణలుచేసింది. ఎందుకు ఇతరుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నావు.. నీ గురించి ఎవరికి తెలియదనుకుంటున్నావా..? అసలు నరేష్ భార్య విషయంలో కలుగజేసుకోవడానికి నువ్వు ఎవరు..? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి నువ్వెవరు..? నీకేం హక్కుంది అంటూ మండి పడింది శ్రీరెడ్డి.
పవిత్ర లోకేష్ కు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని.. ఆమె చాలా మందితో రిలేషన్ షిప్ మెయింటేన్ చేసిందని వెల్లడించించి శ్రీరెడ్డి. అంతే కాదు మీ టూ ఉద్యమం గురించి మాట్లాడితే.. మాకు వ్యతిరేకంగా మాట్లాడింది. నరేష్ కూడా నన్ను మా అసోసియేషన్లో నాలుగేళ్లు బ్యాన్ చేశాడంటూ శ్రీరెడ్డి గతంలో జరిగిన సంఘటనలపై కూడా మాట్లాడారు.
ఇక నరేష్ పైన కూడా గట్టిగానే ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.. అతను నలుగురు ఐదుగురితో ఎఫైర్లు పెట్టుకోవచ్చు.. కాని మేం అన్యయం జరిగింది అని మీ టూ ఉద్యమం చేస్తే మాత్రం వారిపై కక్ష సాధింపు మొదలు పెడతారు. వారిసినిమాలు ప్లాప్ అయ్యేలా చేస్తారు. అసలు నటించడానికి అవకాశాలు రాకుండా చేస్తారు అంటూ మాట్లాడింది శ్రీరెడ్డి.
అంతే కాదు మీ టూ ఉద్యమం గురించి కూడా మాట్లాడింది శ్రీరెడ్డి. ఆ రోజు మొదలుపెట్టిన మీటూ ఉద్యమం రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. తమిళనాడుకు వచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను.. ఇక్కడ నాకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరిగారు అంటుంది శ్రీరెడ్డి. అంతే కాదు అంత నన్ను బిగ్బాస్కు రాకుండా అడ్డుకున్నారు. నన్ను పైకి రానీయకుండా అడ్డుకున్నారు. నాతో అడుకున్న వారందరూ నాశనం అయిపోవాలి. అంటూ శాపం పెట్టింది శ్రీరెడ్డి.
నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. .. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను.. ఆ విషయం ఎవరికి తెలియదు నేను పడుకునే దిండుకు మాత్రమే తెలుసు.. అంటూ శ్రీరెడ్డి ఏడుస్తూ.. తన బాధను వెల్లడించింది. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదని.. కచ్చితంగా అనుభవించి తీరుతారని లైవ్ లో చెప్పింది.