శ్రీముఖి, విష్ణుప్రియా, అవినాష్, అరియానా గోవా వెళ్లింది అందుకు కాదా? కథ వేరే ఉందా?
హాట్ యాంకర్స్ శ్రీముఖి, విష్ణుప్రియా, బిగ్బాస్ 4 ఫేమ్ ముక్కు అవినాష్, అరియానా గ్లోరీ ఇటీవల గోవాలో పోటీ పడి ఎంజాయ్ చేశారు. శ్రీముఖి, విష్ణుప్రియా అయితే రెచ్చిపోయారు. తమకి ఆకాశమే హద్దు అనేలా రెచ్చిపోయారు. బీచ్లో హోయలు పోయారు, నీటిలో తడిసి ముద్దయ్యారు. అయితే వీరు గోవా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటో చూద్దాం.
బిగ్బాస్4 కంటెస్టెంట్ రీయూనియన్ ఈవెంట్ గత వారం జరిగింది. ఈ షో షూటింగ్ పూర్తయిన వెంటనే శ్రీముఖి, విష్ణుప్రియా, ముక్కు అవినాష్, అరియానా గ్లోరీ రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. సముద్రపు నీటితో తడిసి ముద్దయ్యారు. అడ్డూ అదుపు లేకుండా ఎంజాయ్ చేశారు.
ఈ సందర్భంగా గోవా బీచ్లో, రీసార్ట్ లో, వీరు పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.
శ్రీముఖి అయితే ఇంకాస్త రెచ్చిపోయి గ్లామర్ షో కూడా చేసింది.
వీరంతా అక్కడికి వెళ్లింది కేవలం సేద తీరడానికి కాదట. అసలు కారణం వేరే ఉందని, ఇందులో బిజినెస్ యాంగిల్ కూడా ఉందని తెలుస్తుంది.
గోవా బీచ్ సమీపంలో ఓ కొత్త రిసార్ట్ ప్రమోషన్ కోసం వెళ్లినట్టు తెలుస్తుంది. `కోలాగోవా బీచ్రీసార్ట్`ని ప్రమోట్ చేయడానికి వీరిని ఆ రీసార్ట్ నిర్వహాకులు ఆహ్వానించినట్టు సమాచారం.
అందుకే ఈ తొట్టిగ్యాంగ్ `కోలాగోవా బీచ్రీసార్ట్` వద్ద పోజులిచ్చారు. పేరున్న ద్వారం వద్ద రెచ్చిపోయి ఫోటోలకు పోజులివ్వడమే కాదు, వాటిని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
ఈ నలుగురు గ్యాంగ్ కోలాగోవా బీచ్ రీసార్ట్ ని ప్రమోట్ చేసేందుకే గోవా వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు వీరికి భారీగానే అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి గోవాని కూడా ఈ క్రేజీ స్టార్ వాడుకున్నారని, అక్కడ కూడా బిజినెస్ చేసి, క్యాష్ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
లాగూ శ్రీముఖి, విష్ణుప్రియా ఖాళీగా ఉన్నారు. అవినాష్, అరియానా సైతం ఫ్రీనే. ఇలా అయినా సంపాదించుకోవచ్చని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
శ్రీముఖి అక్కడి ప్రాంతాలను, స్పెషాలిటీని స్పెషల్గా చూపించడం విశేషం. ఈ అమ్మడికి బాగానేఅందినట్టు టాక్.
మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. కానీ గోవాలో మాత్రం వీరు రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. అందుకు వారు పంచుకున్న ఫోటోలే చెబుతున్నాయి.