లెహంగా చోళీలో కట్టిపడేస్తున్న శ్రీముఖి...బుట్ట బొమ్మ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్న ఫ్యాన్స్..!
ఓ టీవీ షో కోసం ట్రెండీగా తయారైంది శ్రీముఖి. ఆమె లైట్ పింక్ లెహంగా, చోళీ ధరించి హొయలు పోతుంది. ఆ ఫోటోలు శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా ఆమె ఫ్యాన్స్ బుట్ట బొమ్మలా ఉన్నావ్ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
నవ్వుల బాబు నాగబాబు జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళాక సొంతగా అదిరించి పేరుతో ఓ కామెడీ షో ప్రారంభించారు. జబర్దస్త్ కి పోటీగా పెట్టిన ఈ కామెడీ షో ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
ఈ షోకి మరింత ఆదరణ తేవడం కోసం టాప్ యాంకర్స్ ని లైన్ లో పెడుతున్నాడు నాగబాబు. జబర్దస్త్ కి కొనసాగింపుగా ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టినట్లు, అదిరిందికి కొనసాగింపుగా బొమ్మ అదిరింది అని మరో షో స్టార్ట్ చేశారు.
ఈ షోలో యాంకర్ గా శ్రీముఖి ఉన్నారు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఆ షోలో శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. షోకి పాపులారిటీ తెచ్చుకోవడం కోసం నాగబాబు వివాదాలు కూడా రాజేశారు. సీఎం జగన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఓ స్కిట్ చేయించారు. అది చాల పెద్ద వివాదానికి దారి తీసింది.
నేడు ప్రసారం కానున్న బొమ్మ అదిరింది షో కోసం ట్రెండీగా తయారైన శ్రీముఖి, ఫోటోలకు ఫోజులిచ్చింది. పాల గులాబి రంగు లెహంగా ధరించిన శ్రీముఖి చాలా అందంగా ఉంది. ట్రెడిషనల్ డ్రెస్ ఆమె నాటీ పోజులు ఫ్యాన్స్ కి కిక్కించేలా ఉన్నాయి.
లెహంగాలో శ్రీముఖిని చూసిన ఆమె ఫ్యాన్స్ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరైతే బుట్ట బొమ్మలా చక్కగా ఉన్నావ్ అంటూ పొగిడేస్తున్నారు.
ఇక అనేక టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఉన్న శ్రీముఖి సొంతగా ఓ టాక్ షో నడుపుతుంది. ప్రత్యేకంగా విమెన్ సీలెబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేయడానికి ఓ ఉమనియా అనే షో ప్రారంభించారు. శ్రీముఖి యూ ట్యూబ్ ఛానల్ లో ఇది ప్రసారం కానుంది.
ఓ ఉమనియా టాక్ షోలో యాంకర్ సుమ, హీరోయిన్ పూర్ణ లాంటి వాళ్ళు పాల్గొనడం విశేషం.