శ్రీముఖి చేసిన పనికి బాలయ్య కత్తినూరుతున్నాడట... సుమ చెప్పడంతో టెన్షన్ టెన్షన్!
ఓ టీవీ షోలో యాంకర్ శ్రీముఖి నందమూరి నటసింహం బాలయ్యను ఇమిటేట్ చేశారు. పైసా వసూల్ మూవీలో ఓ సాంగ్ లో బాలయ్య స్టెప్ ని శ్రీముఖి చేసి చూపించారు. దానికి బాలయ్య కోపంతో శ్రీముఖిపై కత్తి నూరుతున్నాడని సుమ చెప్పడంతో ఆమెలో టెన్షన్ మొదలైంది.
స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాంలో శ్రీముఖితో పాటు రోల్ రైడా, విష్ణు ప్రియా, డాన్సర్ పండు మరికొందరు పాల్గొన్నారు.
ఈ షోకి యాంకర్ గా ఉన్న శ్రీముఖి షోలో పాల్గొన్న వీరిని టీమ్స్ గా విభజించి ప్రశ్నలు అడిగారు. సాంగ్స్ గెస్ చేయాల్సిన రౌండ్ లో చిరంజీవి పాట ఫజిల్ గా ఇచ్చారు.
చిరంజీవి, రాధికా హిట్ సాంగ్.. నవ్వింది మల్లి చెండు... సాంగ్ ని గెస్ చేసిన శ్రీముఖి, పాట పాడడమే కాకుండా.. లాస్ట్ లో మెగాస్టార్ అంటూ గట్టిగా అరిచింది.
దానికి యాంకర్ సుమ.. ఇంట్లో ప్రశాంతంగా పెసరట్టు ఉప్మా వేసుకుంటున్న చిరంజీవిగారు బయపడి ఉంటారని సెటైర్ వేసింది.
ఎక్కడో ఉన్న చిరంజీవికి శ్రీముఖి కేక వినిపించి ఉంటుందనే అర్థంలో సుమ చమత్కరించారు.
ఆ తరువాత బాలయ్య పాటను పాడిన శ్రీముఖి.. ఆయన బాడీ లాంగ్వేజ్ అనుకరించడం జరిగింది. చిరంజీవి పెసరట్టు వేసుకుంటున్నారు... కానీ బాలయ్య మాత్రం నీపై కత్తి నూరుతున్నారట అని.. మరో పంచ్ విసిరింది సుమ.
బాలయ్యకు కోపం వస్తే నీ పని గోవిందా అని సుమ... శ్రీముఖిని హెచ్చరించారు. చిరు పెద్దగా పట్టించుకోరు కానీ బాలయ్యతో జాగ్రత్తగా ఉండాలని సుమ చెప్పకనే చెప్పింది.
గతంలో ఝాన్సీ, శ్రీముఖి ఈ షోకి యాంకర్స్ గా వ్యవహరించారు. ఐతే షోకి అంతగా ఆదరణ దక్కలేదు.. దీనితో సుమను రంగంలోకి దించారు.