పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
పెళ్లై, పిల్లలున్నా కొందరు సెలబ్రిటీలు మళ్లీ ప్రేమలో పడ్డారు. రూమరో, నిజమో తెలియదు కానీ.. ఇలాంటి వివాదాల వల్ల తమ కాపురాలు పాడు చేసుకున్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. వివాహ బంధం నుంచి విడాకుల వరకు వెళ్లిన ఆ స్టార్స్ ఎవరో తెలుసా?

విజయ్ దళపతి
నటుడు విజయ్ దళపతికి మరో నటితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విజయ్, నటి త్రిషతో కలిసి ఒకే కారులో పెళ్లికి హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇలా ఇంకొంత మంది తారలు కూడా ఇలాంటి వివాదాల వల్ల ఇబ్బందులు పడ్డారు.
జయం రవి
నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి.. గాయని కెనిషాతో సంబంధంలో ఉన్నారని ఆయన భార్య ఆరతి మోహన్ ఆరోపించారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. తాము సంబంధంలో ఉన్నది నిజమేనని వారిద్దరూ ఒప్పుకున్నట్లు సమాచారం.
ధనుష్
ప్రభుదేవా-నయనతార
ప్రభుదేవా, నయనతార ప్రేమకథ అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ప్రభుదేవా, నయనతారతో ప్రేమలో పడ్డారు. ఈ కారణంగానే ప్రభుదేవా, ఆయన భార్య విడిపోయారు. క్రిస్టియన్ అయిన నయనతార, ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటే ఊరుకోమని కొన్ని సంస్థలు హెచ్చరించడం,, ప్రభుదేవ మొదటి భార్య గొడవ చేయడంతో.. నయన్ ప్రభుదేవాకు దూరమయ్యారని చెబుతారు. ఇక ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.

