రామ్తో పెళ్లి అసలు విషయం రివీల్ చేసిన సింగర్ సునీత.. హనీమూన్ ప్లాన్ కూడా ఉందట!
టాలీవుడ్ సింగర్ సునీత.. మూడు రోజుల క్రితం డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. అయితే ఆమెతో సునీతకి సంబంధం ఏంటి? వీరిద్దరు ఎలా కలిశారు? అసలేం జరిగిందనే విషయాలు తెలుసుకునేందుకు ఆమె అభిమానులు, సినీ జనాలు ఆసక్తితో ఉన్నారు. ఆ విషయాలన్నీ తాజాగా వెల్లడించింది సింగర్ సునీత.
డిజిటల్ రంగంలో రాణించే రామ్ వీరపనేని ఈ నెల 9న శంషాబాద్లోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్లో గ్రాండ్గా రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సునీత కుమారుడు, కూతురు పెళ్లి పెద్దలయ్యారని చెప్పొచ్చు. దగ్గరుండి వారిద్దరు సునీతకి సంబంధించి అన్నీ బాగా చూసుకున్నారట.
ఇక వీరి వివాహ వేడుకకి నితిన్ దంపతులు, దిల్రాజు దంపతులు, యాంకర్సుమ, అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తదితర ఇతర సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఫస్ట్ టైమ్ పెళ్లి ఎంత గ్రాండియర్గా జరుగుతుందో, రెండో వివాహాన్ని కూడా అంతకు మించిన గ్రాండియర్గా చేసుకుంది సునీత. ప్రస్తుతం ఆయా ఫోటోలు పంచుకోగా విశేషంగా వైరల్ అవుతున్నాయి.
రామ్, సునీత ఒకరినొనరు ఆప్యాయంగా హత్తుకోవడం, ప్రేమతో ముద్దులు పెట్టుకోవడం, సంతోషంతో సునీత ఉప్పొంగిపోవడం వంటి సన్నివేశాలు ఈ మ్యారేజ్ వేడుకలో హైలైట్గా నిలిచాయి.
వీటిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. రెండో పెళ్లికి ఇంత హడావుడి ఏంటీ? ఏం సాధించారని ఇంత ఆనందం అంటూ కత్తి మహేష్లాంటి వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అవన్నీ పక్కన పెడితే సునీత్ పెళ్లి తాజాగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. పెళ్లీడుకు వచ్చిన పిల్లలు పెట్టుకుని సునీత ఈ రేంజ్లో వివాహం చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అయితే మ్యారేజ్ విషయంలో సునీత మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. తన పెళ్లిని స్వర్గంతో పోల్చారు. రామ్తో జీవితాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఆమె ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపింది.
సునీత మాట్లాడుతూ, రామ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, తన సోషల్ మీడియా అకౌంట్స్ ని చూసుకునే వారని తెలిపింది. అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని, ఈ జర్నీలో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సునీత వెల్లడించింది.
రామ్తో మ్యారేజ్ ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు పిల్లలే గుర్తొచ్చారు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయాలతో వారు ఇబ్బంది పడకూడదు. అలానే జీవిత భాగస్వామి ఉండటం కూడా నాకు ముఖ్యమే. లైఫ్లో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచే వారు, మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం మన అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం దక్కింద`ని చెప్పింది సునీత.
`మా పేరెంట్స్ ఎన్నో ఏళ్లుగా నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని పక్కన పెడుతూ వచ్చాను. ఇప్పుడు వారు పెద్దవాళ్లయ్యారు. పరిస్థితులను అర్థం చేసుకునే పరిణీతి వారిలో వచ్చింది. నా నిర్ణయాన్ని చెప్పాలనుకున్నా.
రామ్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను హగ్ చేసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారని, తమకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. పిల్లలు ఇంత బాగా అర్థం చేసుకుంటారని ఊహించలేదు. అది నా అదృష్టం. ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు అన్ని రకాలుగా అండగా ఉంది` అని చెప్పింది సునీత.
కరోనా కారణంగా మ్యారేజ్ సింపుల్గానే జరుపుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితలను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు ఫ్యామిలీలు చాలా పెద్దవి. దీంతో రెండు వందలకుపైగానే పెళ్లి అతిథులయ్యారు.
ఇంకా మాకు కావాల్సిన వారు చాలా ఉన్నారు. వారిని ఆహ్వానించి రిసెప్షన్ చేయడం కష్టం. అందుకే రిసెప్షన్ చేయడం లేదు. వారందరికీ చిన్న చిన్న పార్టీలు ఇవ్వాలనుకుంటున్నాం.
అనంతరం మా హనీమూన్ ప్లాన్ చేస్తాం` అని చెప్పింది సునీత. ఈ హనీమూన్ ప్లానే ఇప్పుడు మరింత హైలైట్గా మారింది.
గతంలో రెండో పెళ్ళి ప్లాన్ వార్తలను ఖండించిన సునీత.. గత నెలలో రామ్తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.