తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్... ఆ పని తనకు నచ్చలేదంటున్న బ్యూటీ.
తమిళనాడు సీఎంపై ఫైర్అయ్యింది.. ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. తాజాగా ఆమె ఓ పోస్ట్ లో.. సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ ఆర్టిస్ట్ . ఇంతకీ ఆమె ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందటే.?

కావట్రవర్సీకి కేరాఫ్అడ్రస్ గామారింది సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. తమిళనాట మీటు ఉద్యమంలో.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది. ఎన్నోసినిమాలకు పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెపుతూ.. స్టార్ గా మారింది. అయితే ఈక్రమంలో ఎంతో మందిపై విమర్షలు చేసిన సింగర్ చిన్మయి.. పెద్ద పెద్దవారపై కూడా గట్టిగా ఆరోపణలు చేసింది.
మీటూ ఉద్యమంలో భాగంగా.. తమిళ పాటల రచయిత వైరముత్తు మీద కూడా ఆరోపణలు చేయడం.. తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యల కారణంగా తమిళ్ ఇండస్ట్రీ చిన్మయిని బ్యాన్ చేసింది.
అయితే ఈక్రమంలో వైరముత్తుకు సబంధించి ఎన్నో సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టింది చిన్మయి. ఆయపై కేసులు కూడా నమోదు చేసింది. కాగా.. ఈక్రమంలో తాజాగా వైరి ముత్తు పుట్టినరోజు సందర్భంగా.. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ విషయంలో సీఎంను ప్రశ్నిస్తూ.. ఆమె ఓ లేఖ రిలీజ్ చేసింది.
సీఎం స్టాలిన్ పై మండి పడింది చిన్మయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు..? అటువంటివారితో కలిసి మీరు కూడా నమ్మకం కోల్పోతారు అంటూ చిన్మయి ఫైర్ అయ్యింది. చిన్మచి పోస్ట్ లో ఏముందంటే... మీటూ ఉద్యమంలో భాగంగా అతని మీద ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి నా మీద తమిళ ఇండస్ట్రీ కక్ష కట్టింది. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
మరి నేను గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. అయినా నన్ను బ్యాన్ చేశారు. గత ఐదేళ్లుగా నరకం చుస్తున్నాను అన్నారు. న్యాయం కోసం కోర్ట్ లో కేసు వేశాను..దాంతో న్యాయం అడుగుతావా అని నా మీద కక్ష పెంచుకున్నారు. అసలు వేధించేవాడు కవి ఎలా అవుతాడు.. దశాబ్దాల క్రితం జన్మించాడు... ఆదర్శంగా ఉండాల్సిన వాడు.. కాని అతను ఏ స్త్రీ మీద అయినా చేయి వేయగలుగుతాననుకుంటాడు.. అంటూ మండిపడింది చిన్మయి.
అడ్డు చెప్పే వారి నోరు మూయించడానికి అతనికి డీఎంకేతో, రాజకీయ నాయకులతో ఉన్న బంధం కలిసొచ్చింది అని అన్నారు చిన్మచి.. అంతే కాదు.. ఇలాంటి పనులు చేసిన వారికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ లాంటి గొప్ప గొప్ప అవార్డులు ఎలా ఇచ్చారు. జాతీ అవార్డ్ ఎలా వచ్చాయి. అవన్నీ అధికారం అడ్డుపెట్టుకునిచేసినవే.. అతని అధికారం అలాంటిది. అందుకే అతని వేధింపుల గురించి చెప్పలేకపోయాం. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే.. సిగ్గుగా అనిపిస్తుంది అంటూ వాపోయింది.
Chinmayi
అంతే కాదు.. గొప్ప సంస్కృతి ఉన్న తమిళ గడ్డ మీద ఇలాంటి వేధింపులకు పాల్పడే వారికి పుట్టిన రోజులు చేస్తూ ఉండండి. సున్నితత్వం, సానుభూతి, విద్య వంటివి వాటి మీద ఇక్కడి వారికి అవగాహన శూన్యం. వైరముత్తు లాంటి వాళ్లు రాజకీయ నాయకుల అండతో ఇంకెన్ని తప్పులు చేస్తారో’ అని తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చింది.